PM Modi: సిక్కిం రాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం గ్యాంగ్టక్లో సందడి చేశారు. పర్యటనలో భాగంగా ఆయన స్థానిక యువకులతో కలిసి ఫుట్బాల్ ఆడుతున్న వీడియోను పంచుకున్నారు. బ్లూ కలర్ స్పోర్ట్స్ జాకెట్ ధరించిన ప్రధాని మైదానంలో గోల్ కొట్టడం ఆపై యువ ఆటగాళ్లతో కలిసి సంబరాలు చేసుకున్నారు. గ్యాంగ్టక్లో ఆహ్లాదకరమైన ఉదయం వేళ యువ మిత్రులతో కలిసి ఫుట్బాల్ ఆడటం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్లో పేర్కొన్నారు. యువతలో ఉన్న ఉత్సాహం తనకు కూడా ఎనర్జీని ఇచ్చిందని ప్రధాని తన పోస్ట్లో రాశారు.
అధికారిక పర్యటనలో ఉన్నప్పటికీ ప్రధాని మోదీ అత్యంత సాధారణంగా క్రీడాకారులతో మమేకమవ్వడం అందరినీ ఆకట్టుకుంది. ఆటగాళ్లతో హై-ఫైవ్ ఇస్తూ వారిని ఉత్సాహపరుస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. సిక్కిం రాష్ట్రం భారత యూనియన్లో విలీనమై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న స్వర్ణోత్సవ ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తూ రూ. 4,000 కోట్లకు పైగా విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. సిక్కిం సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ప్రధాని పునరుద్ఘాటించారు.
ప్రధాని ప్రారంభించిన ప్రాజెక్టులు మౌలిక సదుపాయాలు రవాణా ఆరోగ్యం విద్య విద్యుత్ వంటి కీలక రంగాలకు సంబంధించినవి. పట్టణాభివృద్ధి పర్యావరణం పర్యాటక రంగాలతో పాటు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని అధికారులు వెల్లడించారు. సిక్కిం గోల్డెన్ జూబ్లీ ఏడాదిలో ప్రధాని పర్యటన ఒక మైలురాయిగా నిలిచిపోయింది. హిమాలయ రాష్ట్రం స్థిరమైన అభివృద్ధి పథంలో సాగడానికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఈ పర్యటన ద్వారా సిక్కిం ప్రజలతో ఉన్న అనుబంధాన్ని ప్రధాని మరోసారి చాటుకున్నారు.
A football morning in Gangtok! We learnt, we played, we celebrated and above everything else, we enjoyed the game…. pic.twitter.com/rZ0jLey5u7
— Narendra Modi (@narendramodi) April 28, 2026
Read Also: మోదీ పాలనలో వ్యవస్థల విధ్వంసం.. కుటుంబ వివాదాలతో కేసీఆర్ ఆగమాగం: మహేష్ కుమార్ గౌడ్