BigTV English

Himachal pradesh : హిమాచల్ ప్రదేశ్ లో కొనసాగుతున్న పోలింగ్..సెంటిమెంట్ పనిచేస్తుందా?

Himachal pradesh : హిమాచల్ ప్రదేశ్ లో కొనసాగుతున్న పోలింగ్..సెంటిమెంట్ పనిచేస్తుందా?

Himachal pradesh : హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుంది. మొత్తం 68 నియోజకవర్గాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 412 మంది అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నారు. రాష్ట్రంలో 55, 92, 828 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల విధుల్లో 50 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు. ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్, ఆయన కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.


వరసగా రెండోసారి అధికారంలోకి వచ్చి హిమాచల్ ప్రదేశ్ లో కొత్త చరిత్ర సృష్టించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అధికార పక్షాన్ని ఓడించి విపక్ష పార్టీకి పట్టం కట్టే సంప్రదాయం ఈ రాష్ట్రంలో ఉంది. అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని కాంగ్రెస్ నమ్ముతోంది. మరోవైపు ఆమ్‌ఆద్మీ పార్టీ హిమాచల్ ప్రదేశ్ లో బరిలో ఉంది. ఆప్ ను ఏ మేరకు ప్రజలు ఆదరిస్తారో చూడాలి మరి.

హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు ఉత్సాహంగా ఓటేసి సరికొత్త చరిత్ర సృష్టించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ప్రజలకు రాష్ట్ర పరిస్థితిపై అవగాహన ఉందని అందుకు తగ్గట్టుగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు.


Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×