E-Paper
Advertisement

Poornima Kothari : ‘నా సోదరుల ప్రాణ త్యాగానికి ఫలితం దక్కింది.. 33 ఏళ్ల తర్వాత వారి కోరిక నిజమైంది..’

Ayodhya ram mandir : అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమ పనులు వేగంగా సాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా రామ మందిరం నిర్మాణాం కోసం భక్తులు ప్రముఖులు అయోధ్యకు చేరుకుంటున్నారు. యావత్ దేశం అంతా రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం ఎదురుచూస్తున్నారు. అయోధ్యలో రామ జన్మభూమితో తమ కుటుంబ సభ్యులకు అనుబంధం ఉందని పూర్ణిమా కొఠారి సంతోషం వ్యక్తం చేసింది. అయోధ్యలో1990 లో కరసేవకులు చేపట్టిన రామ రథయాత్ర హింసాత్మకంగా మారింది. పరిస్థితి విషమించడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పూర్ణిమా కొఠారి సోదరులు 23 ఏళ్ల రామ్ కుమార్ కొఠారి , 20 ఏళ్ల శరత్ కుమార్ కొఠారి మృతి చెందారు.

Poornima Kothari : ‘నా సోదరుల ప్రాణ త్యాగానికి ఫలితం దక్కింది.. 33 ఏళ్ల తర్వాత వారి కోరిక నిజమైంది..’
Advertisement

Poornima Kothari : అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమ పనులు వేగంగా జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా రామ మందిరం ప్రారంభం కోసం భక్తులు, ప్రముఖులు అయోధ్యకు చేరుకుంటున్నారు. యావత్ దేశం అంతా రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం ఎదురుచూస్తున్నారు.

అయోధ్యలో రామ జన్మభూమితో తమ కుటుంబ సభ్యులకు అనుబంధం ఉందని పూర్ణిమా కొఠారి తెలిపింది. అయోధ్యలో1990 లో కరసేవకులు చేపట్టిన రామ రథయాత్ర హింసాత్మకంగా మారింది. పరిస్థితి చేదాటడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పూర్ణిమా కొఠారి సోదరులు 23 ఏళ్ల రామ్ కుమార్ కొఠారి, 20 ఏళ్ల శరత్ కుమార్ కొఠారి అశువులు బాసారు.

Advertisement

తన ఇద్దరు తమ్ముళ్ల ప్రాణ త్యాగాలకు తగిన ఫలితం దక్కిందని ఆమె ఆనందం వ్యక్తం చేసింది. తన జీవితంలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట వేడుకను జీవితంలో ఎప్పటికి మర్చిపోనని ఆమె తెలిపింది. 33 ఏళ్ల క్రితం తన సోదరులు కళ త్వరలో నేరవేరబోతుందన్నారు. 2014 ముందు వరకు తన ఇద్దరు సోదరులు చేసిన ప్రాణ త్యాగం వృథా అయిందని చాలా సార్లు బాధపడినట్లు తెలిపింది. చివరకు ఆలయ నిర్మాణం జరగడం సంతోషంగా ఉందని ఆమె హర్షం వ్యక్తం చేసింది.

1990 వ సంవత్సరంలో కరసేవకులు చేపట్టిన యాత్రలో రామ్ కొఠారి, శరత్ కొఠారి కోల్ పాల్గొన్నారు. యాత్ర బెనారస్ వరకు చేరుకోగానే హింసాత్మకంగా మారింది. దీంతో పోలీసులు యాత్ర చేసేవారిని నిలువరించారు . అయితే రామ్ కొఠారి, శరత్ కొఠారి బెనారస్ నుంచి టాక్సిలో ప్రయాణించి అయోధ్యకు చేరుకున్నారు. అయోధ్యలో అల్లర్లు చెలరేగడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రామ్ కొఠారి , శరత్ కొఠారి ప్రాణాలు కోల్పోయారు.

Related News

గుజరాత్‌లో తాగునీటి సంక్షోభం.. మోదీ జల్ జీవన్ మిషన్ పై మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు!

జైల్లోనూ మారని బుద్ధి.. ప్రజ్వల్ రేవణ్ణ ఫోన్‌లో పదుల సంఖ్యలో పో*ర్న్ వీడియోలు!

15 సార్లు అమెజాన్ ఇంటర్‌వ్యూలో ఫెయిల్.. చివరకు అదే కంపెనీలో రూ.కోట్ల జీతానికి జాబ్..

జిన్ పింగ్ రాకకు ముందు.. చైనా రాయబారి ఆసక్తికర పోస్ట్.. ఏమన్నారంటే?

UPSCలో జాబ్స్.. కేంద్ర ప్రభుత్వంలో 212 ఉద్యోగ ఖాళీలు.. వెంటనే అప్లై చేయండి

ఆత్మీయ కౌగిలి.. తిరుక్కురళ్ కానుక.. భారత్ – రష్యా బంధంలో మరో కీలక ఘట్టం!

5G సిగ్నల్ సరిగ్గా రాలేదని.. జియో ఎంప్లాయ్‌ని టవర్‌కే కట్టేశారు!

దేశంలో ఘోరం.. భార్య, ముగ్గురు కూతుళ్లను.. రాయితో కొట్టిచంపిన కిరాతకుడు!

Big Stories

Advertisement
×