E-Paper
Advertisement

Pune: దారుణం.. మహిళకు ఎముకలు తినిపించారు!

Pune: దారుణం.. మహిళకు ఎముకలు తినిపించారు!

Pune: టెక్నాలజీ దినదినా అభివృద్ధి చెందుతున్నప్పటికీ కొందరు మూఢనమ్మకాలను మాత్రం వీడడం లేదు. నిత్యం ఏదో ఒక చోట మూఢనమ్మకాల పేరుతో దారుణాలకు పాల్పడుతున్నారు. కొందరు తాంత్రికుల తప్పుడు మాటలు నమ్మి నరబలి, జంతుబలులు ఇస్తున్నారు. తాజాగా పిల్లలు పుట్టడం లేదని ఓ మహిళ చేత స్మశానంలో ఎముకలు తినిపించారు. ఈ దారుణమైన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

పుణెకు చెందిన ఓ మహిళకు పెళ్లై ఐదు సంవత్సాలు గడిచినా సంతానం కలగ లేదు. దీంతో ఆమె భర్తతో పాటు, కుటుంబ సభ్యులు శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలుపెట్టారు. నిత్యం సూటిపోటి మాటలతో వేధించారు. పలుమార్లు తాంత్రికుడితో క్షుద్ర పూజలు కూడా నిర్వహించారు. ఇటీవల నరబలి, జంతుబలి ఇచ్చే ఓ మాంత్రికుడితో అర్థరాత్రి స్మశానంలో తాంత్రిక పూజలు చేయించారు. బాధిత మహిళను బలవంతంగా పూజలో కూర్చోబెట్టి ఆమె చేత మనుషుల అస్థికలను తినిపించారు.

భర్త, కుటుంబ సభ్యుల ఆగడాలతో విసిగి పోయిన బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు భర్త, కుటుంబ సభ్యులు, తాంత్రికుడితో సహా వారికి సహకరించిన మొత్తం 8 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×