BigTV English

TTD : తిరుమల డ్రోన్ కెమెరా దృశ్యాలు..టీటీడీ యాక్షన్ ఇదే..!

TTD : తిరుమల డ్రోన్ కెమెరా దృశ్యాలు..టీటీడీ యాక్షన్ ఇదే..!

TTD : నో ఫ్లై జోన్ గా ఉన్న తిరుమలలో డ్రోన్ కెమెరా ఎగిరింది. శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని పై నుంచి వీడియో తీశారు. ఆ దృశ్యాలను ఇన్‌స్టాగ్రామ్‌ రీల్‌ ద్వారా పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో పెనుదుమారం రేగింది. ఈ నేపథ్యంలో తిరుమల డ్రోన్ కెమెరా దృశ్యాల ఘటనపై చర్యలు తీసుకునేందుకు టీటీడీ రంగంలోకి దిగింది.


టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ ఘటనపై స్పందించారు. డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించిన దృశ్యాల ఇన్‌స్టాగ్రామ్‌ రీల్ ను‌ హైదరాబాద్‌కు చెందిన సంస్థ సోషల్ మీడియాలో ప్రసారం చేసినట్లు గుర్తించామని వెల్లడించారు. ఆ సంస్థపై క్రిమినల్‌ కేసు నమోదు పెడతామని స్పష్టంచేశారు. పటిష్ఠ భద్రత ఉన్న ఆలయంపై డ్రోన్‌తో చిత్రీకరించేందుకు అవకాశం లేదన్నారు. పాత చిత్రంతో యానిమేట్‌ చేశారా? అనే కోణంలో పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించామని సుబ్బారెడ్డి చెప్పారు. భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. భద్రత పరంగా ఎలాంటి ఇబ్బందిలేదన్నారు.

ఆగమశాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయంపై ఎలాంటి వస్తువులు ఎగరడానికి వీలులేదు. అయితే బీడి ఆంజనేయ స్వామి ఆలయం నుంచి పశ్చిమ మాఢవీధి వరకు డ్రోన్ కెమెరాతో చిత్రీకరించారు. శ్రీవారి ఆనంద నిలయం, ఆనంద నిలయ గోపురాలకు దగ్గరగా వీడియో తీశారు. నో ఫ్లై జోన్‌గా ఉన్న తిరుమలలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో విమర్శలు వస్తున్నాయి. ఆలయ భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ తిరుమలలో భద్రతా వైఫల్యంపై విమర్శలు వచ్చాయి.


Tags

Related News

Uppada: పవన్ భరోసా.. ఉప్పాడలో ఆందోళన విరమించిన మత్స్యకారులు

Tirumala Geo Tagging: తిరుమలలో భక్తుల భద్రతకు టీటీడీ వినూత్న ఆలోచన.. పిల్లలు, సీనియర్ సిటిజన్లకు జియో ట్యాగింగ్

Amaravati – Jagan: అమరావతి పై వైసీపీ వైఖరి చెప్పాల్సింది సజ్జల కాదు జగన్.. ఏపీ అసెంబ్లీ లో ఆసక్తికర ప్రస్తావన

Ontimitta Sri Rama Statue: ఒంటిమిట్టలో శ్రీ రాముడి 600 అడుగుల విగ్రహం

AP Assembly Session: సీఎంపై వైసీపీ ఎమ్మెల్సీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. మండలిలో రచ్చ రచ్చ

Cm Chandrababu: అసెంబ్లీకి ఎమ్మెల్యేలు డుమ్మా.. సీఎం చంద్రబాబు సీరియస్

Ayyanna vs Jagan: జగన్ రప్పా రప్పా కామెంట్స్.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం, ఆయన్ని చూసి నేర్చుకో

Payyavula Vs Botsa: మండలిలో పీఆర్సీ రచ్చ.. వాకౌట్ చేసిన వైసీపీ, మంత్రి పయ్యావుల ఏమన్నారు?

Big Stories

×