E-Paper
Advertisement

TTD : తిరుమల డ్రోన్ కెమెరా దృశ్యాలు..టీటీడీ యాక్షన్ ఇదే..!

TTD : తిరుమల డ్రోన్ కెమెరా దృశ్యాలు..టీటీడీ యాక్షన్ ఇదే..!
Advertisement

TTD : నో ఫ్లై జోన్ గా ఉన్న తిరుమలలో డ్రోన్ కెమెరా ఎగిరింది. శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని పై నుంచి వీడియో తీశారు. ఆ దృశ్యాలను ఇన్‌స్టాగ్రామ్‌ రీల్‌ ద్వారా పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో పెనుదుమారం రేగింది. ఈ నేపథ్యంలో తిరుమల డ్రోన్ కెమెరా దృశ్యాల ఘటనపై చర్యలు తీసుకునేందుకు టీటీడీ రంగంలోకి దిగింది.

టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ ఘటనపై స్పందించారు. డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించిన దృశ్యాల ఇన్‌స్టాగ్రామ్‌ రీల్ ను‌ హైదరాబాద్‌కు చెందిన సంస్థ సోషల్ మీడియాలో ప్రసారం చేసినట్లు గుర్తించామని వెల్లడించారు. ఆ సంస్థపై క్రిమినల్‌ కేసు నమోదు పెడతామని స్పష్టంచేశారు. పటిష్ఠ భద్రత ఉన్న ఆలయంపై డ్రోన్‌తో చిత్రీకరించేందుకు అవకాశం లేదన్నారు. పాత చిత్రంతో యానిమేట్‌ చేశారా? అనే కోణంలో పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించామని సుబ్బారెడ్డి చెప్పారు. భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. భద్రత పరంగా ఎలాంటి ఇబ్బందిలేదన్నారు.

Advertisement

ఆగమశాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయంపై ఎలాంటి వస్తువులు ఎగరడానికి వీలులేదు. అయితే బీడి ఆంజనేయ స్వామి ఆలయం నుంచి పశ్చిమ మాఢవీధి వరకు డ్రోన్ కెమెరాతో చిత్రీకరించారు. శ్రీవారి ఆనంద నిలయం, ఆనంద నిలయ గోపురాలకు దగ్గరగా వీడియో తీశారు. నో ఫ్లై జోన్‌గా ఉన్న తిరుమలలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో విమర్శలు వస్తున్నాయి. ఆలయ భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ తిరుమలలో భద్రతా వైఫల్యంపై విమర్శలు వచ్చాయి.

Tags

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×