Punjab Terror Plot: ఢిల్లీలో ఎర్రకోట (Delhi Red Fort Blast) వద్ద పేలుడు ఘటన కేసు దర్యాప్తు కొనసాగుతండగానే, పంజాబ్లో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పంజాబ్ లో గ్రనేడ్ దాడులకు ప్లాన్ చేస్తున్న పాకిస్తాన్-ఐఎస్ఐ మద్దతు ఉన్న మాడ్యూల్ను లూథియానా (Ludhiana) పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 10 మంది నిందితులను అరెస్ట్ చేశారు.
ఈ ముఠా కార్యకలాపాలపై పంజాబ్ డీజీపీ కీలక వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో అశాంతి సృష్టించడమే లక్ష్యంగా నిందితులు పనిచేస్తున్నారని తెలిపారు. జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో గ్రెనేడ్ దాడులు చేసి, భయాందోళనలు సృష్టించేందుకు వీరు ప్రణాళిక రచించినట్లు డీజీపీ పేర్కొన్నారు.
Read Also: Peddi Movie: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్… తృట్టిలో తప్పించుకున్న పెద్ది టీం..
నిందితులు పాకిస్తాన్ ఆధారిత హ్యాండ్లర్లతో సంప్రదింపులు జరిపినట్లు దర్యాప్తులో తేలింది. మలేషియాలో ఉన్న ముగ్గురు ఆపరేటర్ల ద్వారా వీరు పాక్ హ్యాండ్లర్లను సంప్రదించి, హ్యాండ్ గ్రెనేడ్లను సేకరించడం, వాటిని నిర్దేశిత ప్రాంతాలకు డెలివరీ చేయడం వంటి పనులను చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల అరెస్ట్తో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.