E-Paper
Advertisement

Metro Trains: మెట్రో రైళ్లలో వాటర్ బాటిల్స్ నిషేధం.. ఎందుకో తెలుసా?

Metro Trains: మెట్రో రైళ్లలో వాటర్ బాటిల్స్ నిషేధం.. ఎందుకో తెలుసా?
Advertisement

మెట్రో ప్రయాణీకులకు అధికారులు కీలక సూచనలు చేశారు. ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ వాటర్ బాటిళ్లు, లైటర్లు తీసుకురావద్దని సూచించారు. అన్ని మెట్రో స్టేషన్లలో ప్రయాణీకులను ప్రయాణీకులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇకపై భద్రతా తనిఖీలు మరింత కఠినంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అయితే, ఈ తనిఖీలు హైదరాబాద్ లో కాదు. బంగ్లాదేశ్ లోని ఢాకాలో. ఇటీవల పలు బస్సులకు ఆగంతకులు నిప్పు పెట్టిన నేపథ్యంలో బంగ్లాదేశ్ భద్రతా సిబ్బంది ఇకపై అలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఢాకా మెట్రో స్టేషన్లలో విస్తృత తనిఖీలు

తాజాగా ఢాకా మెట్రో ప్రయాణికుల పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే స్టేషన్లలోకి అనుమతించారు. చాలా మంది ప్రయాణీకుల నుంచి లైటర్లు, వాటర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.  ప్రతి మెట్రో స్టేషన్‌ లో భద్రతను పెంచారు. ఢాకా మాస్ ట్రాన్సిట్ కంపెనీ లిమిటెడ్ (DMTCL) మేనేజింగ్ డైరెక్టర్ ఫరూక్ అహ్మద్ ఆధ్వర్యంలో ఈ తనికీలు కొనసాగాయి. మెట్రో స్టేషన్లలో ప్రయాణీకుల బ్యాక్‌ ప్యాక్‌లు, ఇతర వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణీకుల భద్రత అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో ఈ తనిఖీలకు సంబంధించి షేర్ చేసిన ఫోటోల్లో లైటర్లు, వాటర్ బాటిళ్లు స్వాధీనం చేసుకుంటున్నట్లు కనిపించింది.

జులై తిరుగుబాటు తీర్పు నేపథ్యంలో అలర్ట్

Advertisement

అటు జూలైలో జరిగిన తిరుగుబాటు సందర్భంగా జరిగిన నేరాలకు సంబంధించిన కేసులో అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) తీర్పు వెలువరించే తేదీని ప్రకటించింది. సోమవారం నాడు తీర్పు వెల్లడించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత చర్యలు చేపడుతున్నారు. ఈ కేసులో నిందితులుగా మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా, మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్, మాజీ IGP (ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) చౌదరి అబ్దుల్లా అల్ మామున్ ఉన్నారు. అవామీ లీగ్ ఆన్‌ లైన్ ‘లాక్‌డౌన్’ నేపథ్యంలో జులైలో దేశ వ్యాప్తంగా 17 బస్సులకు నిప్పు పెట్టారని అధికారులు వెల్లడించారు. ఢాకా, దాని పరిసర ప్రాంతాలలో 16 సంఘటనలు జరిగాయన్నారు. మెట్రో రైళ్లలోనూ దాడులకు కొంత మంది కుట్రలు చేశారని అధికారులు వెల్లడించారు.

Read Also: నాలుగు నగరాల్లో భారీ విధ్వంసానికి కుట్ర, ప్లాన్ ఎందుకు వర్కౌట్ కాలేదంటే?

బంగ్లాదేశ్ రిఫెరెండమ్ కు నిర్ణయం

Advertisement

గత సంవత్సరం జరిగిన విద్యార్థుల నేతృత్వంలోని తిరుగుబాటు తర్వాత కొత్త సంస్కరణలను బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది. వీటిని ‘జూలై చార్టర్’ పేరుతో అమలు చేయడంపై జాతీయ ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహిస్తుందని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి ముహమ్మద్ యూనస్ తెలిపారు. ఫిబ్రవరిలో పార్లమెంటరీ ఎన్నికలు జరుగుతాయన్నారు. అవి స్వేచ్ఛగా, న్యాయంగా జరగనున్నట్లు వెల్లడించారు. జూలై చార్టర్ దేశ రాజకీయాలను, సంస్థలను పునర్నిర్మించడానికి, మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్ పారిపోవడానికి బలవంతం చేసిన 2024 తిరుగుబాటుకు రాజ్యాంగ గుర్తింపు ఇవ్వడానికి ప్రయత్నిస్తుందని యూనస్ తెలిపారు.

Read Also: గత 5 ఏళ్లలో దేశంలో జరిగిన బాంబు పేలుళ్లు ఇవే, ఎంత మంది చనిపోయారంటే?

Related News

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

Big Stories

Advertisement
×