E-Paper
Advertisement

Rahul Gandhi says ED raid: చక్రవ్యూహం స్పీచ్.. తన ఈడీ దాడులు జరిగే ఛాన్స్-రాహుల్

Rahul Gandhi says ED raid: చక్రవ్యూహం స్పీచ్.. తన ఈడీ దాడులు జరిగే ఛాన్స్-రాహుల్
Advertisement

Rahul Gandhi says ED raid: మోదీ సర్కార్‌పై మరో బాంబు పేల్చారు కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష‌నేత రాహుల్‌గాంధీ. తనను అష్టదిగ్భంధనం చేసేందుకు స్కెచ్ వేసినట్టు చెప్పుకొచ్చారు. అంతేకాదు తనపై ఈడీ దాడులు జరిగే ఛాన్స్ ఉందని సూచనప్రాయంగా చెప్పుకొచ్చారు. రాహుల్ వ్యాఖ్యలపై ఎన్డీయే ప్రభుత్వం ఉలిక్కిపడింది.

తనపై సోదాలు చేసేందుకు ఈడీ సిద్ధమవుతోందన్నారు రాహుల్‌గాంధీ. అందులో పని చేస్తున్న కొందరు వ్యక్తులు తనకు సమాచారం ఇచ్చారని వెల్లడించారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. రీసెంట్‌గా లోక్‌సభలో రాహుల్ తన ప్రసంగంలో చక్రవ్యూహం గురించి మాట్లాడారు. ఆ ప్రసంగం నచ్చకపోవడంతో తనను టార్గెట్ చేసినట్టు తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Advertisement

లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ప్రసంగించారు. కేవలం ఆరుగురు వ్యక్తులు దేశాన్ని పద్మవ్యూహంలోకి నెట్టి వేస్తున్నారని ఆరోపించారు. మహాభారతంలోని యుద్ధం సమయం లో అభిమన్యుడి విషయాన్ని ప్రస్తావించారు. ఆ చక్రవ్యూహంలో ఆరుగురు ఉన్నారని గుర్తు చేశారు. ఆ క్రమంలో ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా మరికొందరిపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం యువత, రైతులు, మహిళలు, చిన్నచిన్న వ్యాపారుల చుట్టూ అలాంటి ఉచ్చు పన్నుతున్నారని దుయ్యబట్టారు.

ALSO READ:  నీట్ కేసు.. తొలి ఛార్జిషీట్‌లో 13 మంది.. కాకపోతే..

Advertisement

ముఖ్యంగా మోదీ సర్కార్ రాజకీయ, వ్యాపార సామ్రాజ్యాన్ని బలోపేతం చేయడమే కేంద్ర బడ్జెట్ ఉద్దేశమని విమర్శలు గుప్పించారు రాహుల్‌గాంధీ. అయితే ప్రతిపక్ష నేత ఆరోపణలపై బీజేపీ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యింది. అప్పటికే రాహుల్ మాటలు ప్రజల్లోకి వెళ్లిపోయారు.. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో తనపై ఈడీ టార్గెట్ చేసిందన్నది రాహుల్ మాట. మరి ప్రతిపక్ష నేత ఆరోపణలపై మోదీ సర్కార్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

 

Related News

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×