E-Paper
Advertisement

Rahul Gandhi: వార్ జోన్‌లో రాహుల్‌గాంధీ.. స్థానికులతో మమేకం.. సీఎం ఆగ్రహం..

Rahul Gandhi: వార్ జోన్‌లో రాహుల్‌గాంధీ.. స్థానికులతో మమేకం.. సీఎం ఆగ్రహం..
Advertisement
rahul gandhi manipur

Rahul Gandhi: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రెండో రోజు మణిపూర్ లో పర్యటిస్తున్నారు. అల్లర్ల కారణంగా నిరాశ్రయులైన బాధితులను ఆయన పరామర్శించారు. మణిపూర్‌లోని మోయిరాంగ్ పట్టణంలోని సహాయ శిబిరాల్లో ఆయన బాధితులతో మాట్లాడారు. వారి సమస్యలను సాదరంగా విన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు, చిన్నారులు కన్నీటి పర్యంతమయ్యారు. రాహుల్ వారిని ఓదార్చి.. సరైన న్యాయం జరిగేంతవరకు పోరాడుతామన్నారు.

మరోవైపు రాహుల్ గాంధీ పర్యటనకు మణిపూర్ లోని బీజేపీ ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తోంది. రాహుల్ వెళ్తే మరిన్ని అల్లర్లు జరుగుతాంటూ తప్పుడు ప్రచారం చేస్తోంది. అయితే రాహుల్ గాంధీ రాకను స్వాగతిస్తూ మణిపురీలు మహిళలు రొడ్డెక్కారు. తమ గోడు వినేందుకు వచ్చిన ఆయనకు ఘన స్వాగతం పలికారు. మణిపూర్ లో శాంతిని నెలకొల్పాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

Advertisement

మరోవైపు, మణిపుర్‌లో రాహుల్ గాంధీ పర్యటనపై అస్సోం సీఎం హిమంత బిశ్వశర్మ విమర్శలు చేశారు. రాష్ట్రానికి కావాల్సింది శాంతియుతమైన వాతావరణమే కానీ.. రాజకీయ నాయకుల ప్రచారం కాదని అన్నారు. శాంతిని నెలకొల్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయని.. ఇలాంటి టైమ్‌లో రాహుల్ రాష్ట్రానికి వచ్చి పరిస్థితులను తమ పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×