E-Paper
Advertisement

Rahul Gandhi: మూడు నెలల నుంచి తపస్సు చేస్తున్నా: రాహుల్ గాంధీ

Rahul Gandhi: మూడు నెలల నుంచి తపస్సు చేస్తున్నా: రాహుల్ గాంధీ
Advertisement

Rahul Gandhi : రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది. యాత్రలో భాగంగా మధ్యప్రదేశ్ లోని రెండవ జ్యోతిర్లింగమైన బాబా మహాకాల్ ఆలయాన్ని ఆయన సందర్శించారు. భోలేనాథ్ ఆశీస్సులు పొందారు. నియమ నిబంధనల ప్రకారం పూజలు చేసి అభిషేకం చేశారు రాహుల్. సంప్రదాయ దుస్తులు ధోతీ, ఎరుపురంగు అంగవస్త్రం, రుద్రాక్షలు ధరించి పూజలు చేసారు. ఆలయ అర్చకులు ఆయనకు గంధం, తిలకం పెట్టారు.

మహాకాల్ ఆలయంలో పూజలు చేసిన అనంతరం ప్రసంగించిన ఆయన.. తపస్విలు పూజింపబడే దేశం ఇది అని రాహుల్ అన్నారు. తాను గత మూడు నెలలుగా తపస్సు చేస్తున్నానని చెప్పుకొచ్చారు. కానీ జీవితంలో చివరి శ్వాస వరకు కష్టపడే రైతులు, కార్మికులు నిజమైన తపస్విలు అని.. వారి ముందు తాను చేసేది చాలా చిన్నది అన్నారు. అలాంటి వారికి ప్రభుత్వం నుంచి అందాల్సినవి అందడం లేదని రాహుల్ విమర్శలు గుప్పించారు. బీజేపీ చేతులెత్తి దేవుడిని పూజిస్తుంది కానీ.. నిజమైన తపస్వీలు అయిన రైతులు, కార్మికులు, చిన్న, మధ్యతరహా వ్యాపారులు, విద్యావంతులైన యువకుల భవిష్యత్తును నాశనం చేస్తుందని రాహుల్ గాంధీ అసహనం వ్యక్తం చేశారు.

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×