E-Paper
Advertisement

మోదీ ప్రభుత్వంపై రాహుల్ ఘాటు వ్యాఖ్యలు.. ఆర్థిక తుఫాను ఉగ్రరూపం దాల్చింది, ఇక కష్టాలు మొదలు

మోదీ ప్రభుత్వంపై రాహుల్ ఘాటు వ్యాఖ్యలు.. ఆర్థిక తుఫాను ఉగ్రరూపం దాల్చింది, ఇక కష్టాలు మొదలు
Advertisement

Raebareli: నరేంద్రమోదీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ. రాబోయే ఆర్థిక షాక్ అదానీ-అంబానీ, మోదీలను ప్రభావితం చేయదన్నారు. చాలా సంవత్సరాలలో చూడని తీవ్రతతో విరుచుకు పడటానికి సిద్ధంగా ఉందన్నారు. మున్నుముందు కష్టకాలం తప్పదని చెప్పకనే చెప్పారు.

మోదీ ప్రభుత్వంపై రాహుల్ ఘాటు వ్యాఖ్యలు

Advertisement

మోదీ నిర్మించిన ఆర్థిక వ్యవస్థపై ఆర్థిక తుఫాను రాబోతోందని కొన్నాళ్లుగా తాను చెబుతున్నారని అన్నారు. అదానీ-అంబానీలకు అనుకూలంగా ఆయన నిర్మించిన వ్యవస్థ నిలవదన్నారు. అది పూర్తిగా కూలిపోవడం ఖాయమని మనసులోని మాట బయట పెట్టారు. ఆ భారాన్ని సామాన్య ప్రజలు మోయాల్సి వస్తుందన్నారు.

వాళ్లంతా తమ రాజ భవనాల్లో కూర్చొంటారని అన్నారు. దాని పరిణామాలను అనుభవించేది యువత, ప్రజలేనని అన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు తీసుకోవడానికి బదులుగా విదేశీ పర్యటనలకు వెళ్లవద్దని దేశానికి చెబుతున్నారు, కానీ మాత్రం ప్రపంచమంతా పర్యటిస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశంలోని యువత, రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులపై తీవ్ర ప్రభావితం చేస్తుందన్నారు.

Advertisement

ఆర్థిక తుఫాను ఉగ్రరూపం దాల్చిందన్న రాహుల్‌గాంధీ

ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా లక్నో ఎయిర్‌పోర్టులో రాహుల్ గాంధీకి కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలి నియోజక‌వర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆయన హాజరయ్యారు.

అంతకుముందు నార్వే పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర‌మోదీ జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలను తప్పించుకున్నారని రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ప్రధాని ప్రవర్తన దేశ ప్రతిష్టను దెబ్బతీసిందన్నారు. నార్వేలో మోదీ వెళ్ళిపోతుండగా ఓ జర్నలిస్ట్ ఆయనను ప్రశ్నించడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాన్ని చూపిస్తున్న ఒక వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు.

ALSO READ: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఆ వీధి కుక్కలను చంపేయొచ్చు!

 

Related News

లిఫ్టులో పెంపుడు కుక్క బీభత్సం.. హడలిపోయిన బాలికలు.. వీడియో వైరల్!

కష్టాలను దాటిన కన్నబిడ్డల కల.. ఒకే ఇంట్లో ముగ్గురు నీట్-2026 విజేతలు

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ నేతపై మహిళ ఇంకు దాడి.. అసలేం జరిగిందంటే?

తమిళనాడులో నడిరోడ్డుపై తగలబడ్డ ప్రైవేట్ బస్సు.. 23 మంది ప్రయాణికులు ఎలా బతికారంటే?

కోయంబత్తూరులో భారీ అగ్నిప్రమాదం.. సిలిండర్లు పేలి 4 ఇళ్లు పూర్తిగా దగ్ధం!

జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం, ఆసుపత్రిలో అత్యవసర చికిత్స!

ఓటు వేరే.. పౌరసత్వం వేరే.. ఎన్నికల సంఘానికి సుప్రీం షాక్!

కర్ణాటకలో ఘోరం.. పట్టపగలే యువతిని కొడవలితో నరికి చంపిన యువకుడు.. ఇదిగో వీడియో!

Big Stories

Advertisement
×