E-Paper
Advertisement

మోదీ ప్రభుత్వంపై రాహుల్ ఘాటు వ్యాఖ్యలు.. ఆర్థిక తుఫాను ఉగ్రరూపం దాల్చింది, ఇక కష్టాలు మొదలు

మోదీ ప్రభుత్వంపై రాహుల్ ఘాటు వ్యాఖ్యలు.. ఆర్థిక తుఫాను ఉగ్రరూపం దాల్చింది, ఇక కష్టాలు మొదలు
Advertisement

Raebareli: నరేంద్రమోదీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ. రాబోయే ఆర్థిక షాక్ అదానీ-అంబానీ, మోదీలను ప్రభావితం చేయదన్నారు. చాలా సంవత్సరాలలో చూడని తీవ్రతతో విరుచుకు పడటానికి సిద్ధంగా ఉందన్నారు. మున్నుముందు కష్టకాలం తప్పదని చెప్పకనే చెప్పారు.

మోదీ ప్రభుత్వంపై రాహుల్ ఘాటు వ్యాఖ్యలు

Advertisement

మోదీ నిర్మించిన ఆర్థిక వ్యవస్థపై ఆర్థిక తుఫాను రాబోతోందని కొన్నాళ్లుగా తాను చెబుతున్నారని అన్నారు. అదానీ-అంబానీలకు అనుకూలంగా ఆయన నిర్మించిన వ్యవస్థ నిలవదన్నారు. అది పూర్తిగా కూలిపోవడం ఖాయమని మనసులోని మాట బయట పెట్టారు. ఆ భారాన్ని సామాన్య ప్రజలు మోయాల్సి వస్తుందన్నారు.

వాళ్లంతా తమ రాజ భవనాల్లో కూర్చొంటారని అన్నారు. దాని పరిణామాలను అనుభవించేది యువత, ప్రజలేనని అన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు తీసుకోవడానికి బదులుగా విదేశీ పర్యటనలకు వెళ్లవద్దని దేశానికి చెబుతున్నారు, కానీ మాత్రం ప్రపంచమంతా పర్యటిస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశంలోని యువత, రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులపై తీవ్ర ప్రభావితం చేస్తుందన్నారు.

Advertisement

ఆర్థిక తుఫాను ఉగ్రరూపం దాల్చిందన్న రాహుల్‌గాంధీ

ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా లక్నో ఎయిర్‌పోర్టులో రాహుల్ గాంధీకి కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలి నియోజక‌వర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆయన హాజరయ్యారు.

అంతకుముందు నార్వే పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర‌మోదీ జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలను తప్పించుకున్నారని రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ప్రధాని ప్రవర్తన దేశ ప్రతిష్టను దెబ్బతీసిందన్నారు. నార్వేలో మోదీ వెళ్ళిపోతుండగా ఓ జర్నలిస్ట్ ఆయనను ప్రశ్నించడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాన్ని చూపిస్తున్న ఒక వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు.

ALSO READ: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఆ వీధి కుక్కలను చంపేయొచ్చు!

 

Related News

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. ఉత్తరాఖండ్‌లో హిమానీనదాల మాటేంటి? ముప్పు పొంచివుందా?

ప్రధాని మోదీ మరోసారి విజ్ఞప్తి.. బంగారం కొనుగోళ్లపై కీలక వ్యాఖ్యలు, స్వదేశీ మంత్రంతోపాటు

Big Stories

Advertisement
×