Raebareli: నరేంద్రమోదీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ. రాబోయే ఆర్థిక షాక్ అదానీ-అంబానీ, మోదీలను ప్రభావితం చేయదన్నారు. చాలా సంవత్సరాలలో చూడని తీవ్రతతో విరుచుకు పడటానికి సిద్ధంగా ఉందన్నారు. మున్నుముందు కష్టకాలం తప్పదని చెప్పకనే చెప్పారు.
మోదీ ప్రభుత్వంపై రాహుల్ ఘాటు వ్యాఖ్యలు
మోదీ నిర్మించిన ఆర్థిక వ్యవస్థపై ఆర్థిక తుఫాను రాబోతోందని కొన్నాళ్లుగా తాను చెబుతున్నారని అన్నారు. అదానీ-అంబానీలకు అనుకూలంగా ఆయన నిర్మించిన వ్యవస్థ నిలవదన్నారు. అది పూర్తిగా కూలిపోవడం ఖాయమని మనసులోని మాట బయట పెట్టారు. ఆ భారాన్ని సామాన్య ప్రజలు మోయాల్సి వస్తుందన్నారు.
వాళ్లంతా తమ రాజ భవనాల్లో కూర్చొంటారని అన్నారు. దాని పరిణామాలను అనుభవించేది యువత, ప్రజలేనని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు తీసుకోవడానికి బదులుగా విదేశీ పర్యటనలకు వెళ్లవద్దని దేశానికి చెబుతున్నారు, కానీ మాత్రం ప్రపంచమంతా పర్యటిస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశంలోని యువత, రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులపై తీవ్ర ప్రభావితం చేస్తుందన్నారు.
ఆర్థిక తుఫాను ఉగ్రరూపం దాల్చిందన్న రాహుల్గాంధీ
ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా లక్నో ఎయిర్పోర్టులో రాహుల్ గాంధీకి కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్బరేలి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆయన హాజరయ్యారు.
అంతకుముందు నార్వే పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలను తప్పించుకున్నారని రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ప్రధాని ప్రవర్తన దేశ ప్రతిష్టను దెబ్బతీసిందన్నారు. నార్వేలో మోదీ వెళ్ళిపోతుండగా ఓ జర్నలిస్ట్ ఆయనను ప్రశ్నించడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాన్ని చూపిస్తున్న ఒక వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు.
ALSO READ: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఆ వీధి కుక్కలను చంపేయొచ్చు!
When there is nothing to hide, there is nothing to fear.
What happens to India’s image when the world sees a compromised PM panic and run from a few questions? https://t.co/tOO8vzESpf
— Rahul Gandhi (@RahulGandhi) May 18, 2026