E-Paper
Advertisement

రైతు భార్య అకౌంట్లో లక్ష్మీదేవి.. ఏకంగా రూ. 10 కోట్లు జమ, ఆమె సమాధానాలకు అందరూ షాక్

రైతు భార్య అకౌంట్లో లక్ష్మీదేవి.. ఏకంగా రూ. 10 కోట్లు జమ, ఆమె సమాధానాలకు అందరూ షాక్

UP Woman: మనకు తెలీకుండా మన బ్యాంక్ అకౌంట్లోకి భారీ ఎత్తున నిధులు జమ అయితే ఒక్కసారిగా షాకవుతాము. ఎలా వచ్చాయి.. ఎవరు వేశారు అనేదానిపై ఆరా తీస్తాం. చాలామంది కొంత డబ్బు వాడుకున్నవారు లేకపోలేదు. యూపీలోని ఓ మహిళకు అలాంటి పరిస్థితి ఎదురైంది. ఏకంగా 10 కోట్ల రూపాయలు ఆమె ఖాతాలో పడ్డాయి. ఆమె సమాధానం చూసి బ్యాంకు అధికారులు అవాక్కయ్యారు.

ఉత్తరప్రదేశ్‌లో రైతు భార్య ఖాతాలో లక్ష్మీదేవి.. కోట్లకు పగడలెత్తింది

ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లా దేవ్‌గంజ్ గ్రామానికి చెందిన రైతు భార్య రీటా. ఆమె ఫ్యామిలీ పూర్తిగా వ్యవసాయ కుటుంబం. కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయం చేస్తోంది ఆమె. నవరాత్రుల సమయంలో అష్టమి రోజున డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి ఏటీఎంకి వెళ్లింది. ఏటీఎం కార్డు పెట్టి బ్యాలెన్స్ చెక్ చేసుకుంది. అందులోని 10 కోట్ల రూపాయలు ఉండడం చూసి ఒక్కసారిగా షాకైంది.

మళ్లీ అనుమానం వచ్చి మరొక ఏటీఎంకి వెళ్లి చెక్ చేసింది. ఈసారి కూడా దాదాపు రూ.9,99,49,588 ఉన్నట్లు చూసి ఆశ్చర్యపోయింది. అది స్క్రీన్‌ షాట్ తీసింది. ఆ తర్వాత ఈ విషయాన్ని రీటా.. తన ఫ్యామిలీ సభ్యులకు తెలిపింది. రీటా ఆ డబ్బు ఉపసంహరించుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఆ నిధులను ముట్టుకోవద్దని ఆమె తన కుటుంబ సభ్యులకు గట్టిగా చెప్పింది.

కుటుంబసభ్యులకు సమాచారం.. ఆమె సమాధానాలకు బ్యాంకు అధికారులు షాక్

ఈ డబ్బు మనది కాదు.. ఒక్క రూపాయి తాకొద్దని కుటుంబసభ్యులకు తేల్చి చెప్పింది. రీటా తన కుటుంబసభ్యులతో కలిసి బ్యాంకుకు వెళ్లింది. సెలవు కారణంగా బ్యాంక్ మూసి ఉంది. చివరకు బ్యాంక్ ఆఫ్ ఇండియా కరీంగంజ్ బ్రాంచ్ మేనేజర్‌తో కలిశారు రీటా కుటుంబ సభ్యులు. సాంకేతిక లోపం కారణంగా లావాదేవీలో తప్పు జరిగి ఉంటుందని రీటాకు చెప్పారు.

బ్రాంచ్ తిరిగి తెరిచిన తర్వాత ఈ విషయంపై విచారణ జరిపి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మేనేజర్. ఈ విషయం ఆ ప్రాంతమంతటా చర్చనీయాంశంగా మారింది. ఆమె కుటుంబానికి నిధులను దుర్వినియోగం చేయడానికి అవకాశం ఉన్నా, రీటా నిజాయితీని మెచ్చుకున్నారు. ఆమె తీసిన స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ALSO READ: వార్ ఎఫెక్ట్.. ప్రపంచ దేశాలు ఎలా ఉన్నా, భారత్‌పై ఎఫెక్ట్ పడనీయం: మోదీ

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×