Sonia Gandhi: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది. గురుగ్రామ్లోని మెదాంత ఆసుపత్రికి చికిత్సల కోసం అక్కడికి వెళ్లినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని ఓ న్యూస్ ఏజెన్సీ తెలియజేసింది. పరీక్షలు చేయించుకోవడానికి వెళ్లారా? లేకుంటే ఆసుపత్రిలో జాయిన్ అయ్యారా? అనేది ఇంకా తెలియాల్సివుంది.
కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ వైద్య పరీక్షల కోసం గురుగ్రామ్లోని మెదాంత ఆసుపత్రిలో చేరారు. 79 ఏళ్ల రాజ్యసభ ఎంపీ సోనియాగాంధీ ఆసుపత్రిలో చేరడం ఇది మూడోసారి. ప్రస్తుతం ఆమె వైద్య పరీక్షలు చేయించుకుంటున్నట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.
గత మార్చిలో శ్వాసకోశ, దీర్ఘకాలిక దగ్గు వంటి సమస్యలతో సర్ గంగారామ్ ఆసుపత్రిలో ఆమె చేరారు. ఆ సమయంలో వాయు కాలుష్యం, శీతాకాల పరిస్థితుల వల్లే ఆస్తమా తీవ్రమైనట్టు వైద్యులు పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. దాదాపు వారం రోజులపాటు ఆమె అక్కడే గడిపిన విషయం తెల్సిందే. ఈ విషయం తెలియగానే కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు అధినేత్రి ఆరోగ్యం గురించి ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సివుంది.