E-Paper
Advertisement

Sonia Gandhi: రాజస్థాన్ రాజ్యసభ బరిలో సోనియా.. నామినేషన్ దాఖలు..

Sonia Gandhi: రాజస్థాన్ రాజ్యసభ బరిలో సోనియా.. నామినేషన్ దాఖలు..
Advertisement
Sonia Gandhi

Sonia Gandhi (political news telugu):

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ బుధవారం రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసేందుకు సోనియా గాంధీ ఈరోజు ఉదయం జైపూర్ చేరుకున్నారు. ఆ తర్వాత నామినేషన్ల పత్రాలు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.

Advertisement

రాజస్థాన్‌ నుంచి 3 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు నిర్వహిస్తారు. అందులో ఒకటి కాంగ్రెస్‌కు గెలవడం ఖాయం. మాజీ పీఎం మన్మోహన్‌ సింగ్‌ పదవీకాలం ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ స్థానానికి ఎన్నిక జరగనుంది. గాంధీ కుటుంబం నుంచి రాజ్యసభకు ఎన్నికవుతున్న రెండో నేతగా సోనియా గాంధీ చరిత్రకెక్కనున్నారు. గతంలో 1964 ఆగస్టు నుంచి 1967 ఫిబ్రవరి వరకు మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు

1998 నుంచి 2022 మధ్య దాదాపు 22 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ ఐదుసార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఇరువురు సోనియాగాంధీతో జైపూర్ వెళ్లనున్నట్లు సమాచారం. సోనియా గాంధీకి కొన్ని ఇతర రాష్ట్రాల వారు నామినేషన్ దాఖలు చేయమని కోరినప్పటికీ, ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభ బరిలో ఉండాలని నిశ్చయించుకుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

Advertisement

Read More: బరేలీ బరిలో ప్రియాంక..? రాజ్యసభకు సోనియా..?

సోనియా గాంధీ రాజస్థాన్‌ను ఎంచుకోవడానికి, తెలంగాణ వంటి రాష్ట్రాలను ఎంచుకోకపోవడానికి పార్టీ నాయకత్వం ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నట్లు కనిపించకూడదనే కారణమని వర్గాలు చెబుతున్నాయి.

పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే కర్నాటకకు చెందినవారు కావడం, రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నందున, సోనియా గాంధీ కోసం పార్టీ ఉత్తరాదిలో ఒక రాష్ట్రంపై ఆసక్తి చూపారు.

సోనియా గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ కంచుకోట అని చెప్పొచ్చు. 2004 ఎన్నికల నుంచి 2019 ఎన్నికల వరకు సోనియా గాంధీ వరుసగా రాయ్‌బరేలీలో గెలిచారు. కాగా 56 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం గత నెలలో ప్రకటించింది. ఫిబ్రవరి 27న ఓటింగ్ జరగనుంది. 15 రాష్ట్రాల నుంచి 56 స్థానాలకు జరిగే ద్వైవార్షిక ఎన్నికలకు కాంగ్రెస్ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఫిబ్రవరి 15.

కాంగ్రెస్ బిహార్‌ నుంచి అఖిలేశ్‌ ప్రసాద్‌ సింగ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి అభిషేక్‌ మను సింఘ్వీ, మహారాష్ట్ర నుంచి చంద్రకాంత్‌ హండోరె రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.

Related News

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

Big Stories

Advertisement
×