E-Paper
Advertisement

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ
Advertisement

Weather Updates:  మే గడిచిపోయింది.. జూన్ వచ్చేసింది.. అయినా ఎండలు ఏ మాత్రం తగ్గలేదు. రాత్రయితే ఒక్కటే ఉక్కుపోత. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ చల్లటి కబురు మోసుకొచ్చింది. మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా వేసింది.

ఆలస్యమైనా చల్లటి కబురు చెప్పిన ఐఎండీ

Advertisement

జూన్ వచ్చేసింది.. దేశంలో ఇంకా ఎండలు మండిపోతున్నాయి. మే చివరి నాటికి రుతుపవనాలు వస్తాయని భారత వాతావరణ శాఖ తొలుత అంచనా వేసింది. అది కాస్త జూన్ మొదటి వారానికి వెళ్లింది. ఈ నేపథ్యంలో చల్లటి కబురు చెప్పింది భారత వాతావరణ శాఖ. రాబోయే రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాల ప్రవేశానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించింది.

అంతా అనుకున్నట్లుగా జరిగితే జూన్ నాలుగు లేదా ఐదున రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని పేర్కొంది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో కొన్ని ప్రాంతాలు లక్షద్వీప్ దీవులు, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించడానికి పరిస్థితులు ఏర్పడినట్టు తెలిపింది.

Advertisement

నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!

నైరుతి, పశ్చిమ మధ్య, తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగతా ప్రాంతాల్లోకి రుతుపవనాలు ఎంటర్ కావచ్చని అంచనా వేసింది. గతవారం సవరించిన అంచనాలు ఈ సీజన్‌లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉంటుందని ఆ శాఖ తెలిపింది.

తక్కువ వర్షపాతం నమోదవడానికి ఎల్ నినో పరిస్థితులు ఏర్పడటమే కారణంగా చెబుతోంది. దీనివల్ల దేశంలో రుతుపవనాల సమయంలో వర్షపాతం తగ్గుతుందన్నది ఐఎండి మాట. జూన్‌లో ఎల్ నినో పరిస్థితులు బలహీనపడి సెప్టెంబర్‌లో మధ్యస్థం నుంచి బలంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.

ALSO READ: సీఎం కోట్ వేసుకోకూడదా? విమర్శకులకు విజయ్ స్ట్రాంగ్ కౌంటర్

మరోవైపు దేశంలో ఎండలు మాత్రం మండిపోతున్నాయి. పగలంతా భానుడు తీవ్ర ప్రతాపం చూపుతున్నాడు. సాయంత్రం ఐదు దాటిన తర్వాత పలు ప్రాంతాల్లో వాతావరణం మారిపోతోంది. రుతుపవనాల ఆలస్యంతో ఉత్తర, మధ్య భారతంలో ఎండలు, వడగాలుల తీవ్రత కొనసాగుతోంది.

Related News

లిఫ్టులో పెంపుడు కుక్క బీభత్సం.. హడలిపోయిన బాలికలు.. వీడియో వైరల్!

కష్టాలను దాటిన కన్నబిడ్డల కల.. ఒకే ఇంట్లో ముగ్గురు నీట్-2026 విజేతలు

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ నేతపై మహిళ ఇంకు దాడి.. అసలేం జరిగిందంటే?

తమిళనాడులో నడిరోడ్డుపై తగలబడ్డ ప్రైవేట్ బస్సు.. 23 మంది ప్రయాణికులు ఎలా బతికారంటే?

కోయంబత్తూరులో భారీ అగ్నిప్రమాదం.. సిలిండర్లు పేలి 4 ఇళ్లు పూర్తిగా దగ్ధం!

జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం, ఆసుపత్రిలో అత్యవసర చికిత్స!

ఓటు వేరే.. పౌరసత్వం వేరే.. ఎన్నికల సంఘానికి సుప్రీం షాక్!

కర్ణాటకలో ఘోరం.. పట్టపగలే యువతిని కొడవలితో నరికి చంపిన యువకుడు.. ఇదిగో వీడియో!

Big Stories

Advertisement
×