E-Paper
Advertisement

Summer Effect : దేశవ్యాప్తంగా మండుతున్న ఎండలు.. ఆ 10 రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం..

Summer Effect : దేశవ్యాప్తంగా మండుతున్న ఎండలు.. ఆ 10 రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం..
Advertisement

Summer Effect : దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించినా ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. కొన్నిరోజులపాటు 10 రాష్ట్రాల్లో వేడిగాలులు వీస్తాయని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌, మహారాష్ట్రలోని విదర్భ, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వచ్చే 3 రోజులు వేడిగాలుల తీవ్రత పెరుగుతుందని హెచ్చరించింది.

Advertisement

విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వేడి గాలులు వీస్తాయని, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లో వచ్చే 3 రోజులు వేడి మరింత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. కోస్తాంధ్ర , యానాం, తూర్పు ఉత్తరప్రదేశ్, బిహార్, తూర్పు మధ్యప్రదేశ్‌లో 2 రోజులపాటు వేడిగాలులు వీస్తాయని తెలిపింది. తెలంగాణ, తమిళనాడు, పశ్చిమ మధ్యప్రదేశ్‌లలోనూ వేడిగాలులు వీస్తాయని ప్రకటించింది.

మరో వైపు బిహార్‌లో హీట్‌వేవ్ 11 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. అంతకుముందు 2012లో 19 రోజులపాటు వేడిగాలులు వీచాయి. ఈ సారి 20 రోజులుగా వేడిగాలులు వీస్తున్నాయి. దీంతో బిహార్‌లో వాతావరణశాఖ రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించింది.

Advertisement

తెలంగాణలో మరో 2 రోజులపాటు వడగాలులు వీచే అవకాశం ఉంది. ఆదివారం విపరీతమైన వేడిగాలులు వీయగా.. సోమ, మంగళవారాలు కూడా భానుడితాపం తప్పదని వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రమాదకర స్థాయిలో వడగాలులు వీచే అవకాశం ఉండటంతో ఆరెంజ్‌ అలర్ట్‌ కూడా జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వడ గాల్పులు ఉంటాయని తెలిపింది. అటు ఆంధ్రప్రదేశ్ లో ఎండలు దంచేస్తున్నాయి.

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×