BigTV English
Advertisement

Arvind Kejriwal Bail Granted: అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్ రిలీఫ్.. మధ్యంతర బెయిల్ జారీ..!

Arvind Kejriwal Bail Granted: అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్ రిలీఫ్.. మధ్యంతర బెయిల్ జారీ..!

Supreme Court Grants Bail to Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ జారీ చేస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసింది.


దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓ పార్టీ అధినేతగా ప్రచారం చేయాల్సిన అవసరాన్ని ధర్మాసనం గుర్తించి.. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తీర్పు వెల్లడించింది. అయితే మే 7వ తేదీన కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆ తీర్పును రిజర్వ్ చేసింది. ఆ విచారణ సమయంలో కేజ్రీవాల్ కు ఒకవేళ బెయిల్ ముంజూరు చేస్తే.. తాను ముఖ్యమంత్రిగా ఎటువంటి అధికారిక పనులు చేపట్టరాదని వెల్లడించింది. దీంతో పాటుగా లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఎటువంటి ఫైల్స్ తిరగేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

లిక్కర్ పాలసీ కేసులో భారీగా మనీలాండరింగ్ జరిగిందనే ఆరోపణలతో ఈడీ అధికారులు మార్చి 21న ఢిల్లీ సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విచారణలో భాగంగా దర్యాప్తు సంస్థలు తొమ్మిది సార్లు కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేశాయి. వాటికి ఆయన స్పందించకపోవడంతో ఆయన్ను ఈడీ అరెస్ట్ చేసి తీహార్ జైలుకు తరలించింది. జైలులో ఉన్న కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా.. దానిపైవిచారణ జరిపిన సుప్రీంకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.


Also Read: కవితకు మళ్లీ నిరాశే.. బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

కేజ్రీవాల్ బెయిల్ పై బయట ఉంటే 21 రోజులు ఆయన ఏం చేయాలో, ఏం చేయకూడదో కోర్టు కొన్ని షరతులను విధించింది. బెయిల్ పై బయట ఉన్న సమయంలో కేజ్రీవాల్ సీఎం కార్యాలయానికి వెళ్లకూడదని స్పష్టం చేసింది. ఢిల్లీ సెక్రెటేరియట్ కు వెళ్లకూడదని ఆంక్షలు విధించింది.

లిక్కర్ పాలసీ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులను కేజ్రీవాల్ కలవకూడదని.. వారితో మాట్లాడకూడదని పేర్కొంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అనుమతి లేకుండా ఎటువంటి ఫైల్స్ పై సంతకం చేయకూడదని వెల్లడించింది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఈ ప్రచారంలో లిక్కర్ పాలసీ గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదని స్పష్టం చేసింది.

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×