E-Paper
Advertisement

మైనర్ బాలిక గర్భవిచ్ఛిత్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. చట్టాలను సవరించాలని కేంద్రానికి సూచన

మైనర్ బాలిక గర్భవిచ్ఛిత్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. చట్టాలను సవరించాలని కేంద్రానికి సూచన
Advertisement

Supreme Court minor abortion case: అత్యాచార బాధితురాలైన 15 ఏళ్ల మైనర్ బాలిక గర్భవిచ్ఛిత్తి వ్యవహారంలో గురువారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాధిత బాలిక 30 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు గతంలోనే అనుమతినిచ్చిన అత్యున్నత న్యాయస్థానం.. తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు జారీ చేసింది. ముఖ్యంగా అత్యాచార బాధితులకు సంబంధించి ప్రస్తుతమున్న గర్భవిచ్ఛిత్తి చట్టాలను మరింత మానవీయ కోణంలో సవరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

అత్యాచార బాధితురాలైన బాలిక మానసిక క్షోభను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, ఆమె ఆరోగ్యంపై శాశ్వత ప్రభావం లేకపోతే గర్భవిచ్ఛిత్తి నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ విషయంలో తుది నిర్ణయాన్ని బాధిత బాలిక, ఆమె తల్లిదండ్రులకే వదిలేస్తున్నట్లు పేర్కొంది. వారికి సరైన నిర్ణయం తీసుకోవడంలో సహాయపడాలని, అవసరమైతే కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచించింది. అత్యాచార బాధితుల కోసం చట్టాల్లో మార్పులు చేయాలని కేంద్రానికి దిశానిర్దేశం చేస్తూ.. 20 వారాలు దాటిన తర్వాత కూడా అవాంఛిత గర్భాన్ని తొలగించుకునేలా నిబంధనలను సవరించాలని న్యాయస్థానం కోరింది.

Advertisement

ఈ కేసులో గర్భవిచ్ఛిత్తికి అనుమతినిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎయిమ్స్ (AIIMS) వైద్య బృందం క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయడంతో వివాదం కొత్త మలుపు తిరిగింది. గర్భం దాల్చి ఇప్పటికే 30 వారాలు దాటినందున.. ఈ దశలో గర్భవిచ్ఛిత్తి చేయడం వల్ల ఆ బాలిక శారీరక.. మానసిక ఆరోగ్యంపై సుదీర్ఘకాలం పాటు తీవ్ర ప్రభావం పడుతుందని ఎయిమ్స్ కోర్టుకు నివేదించింది. మరో నాలుగు వారాల్లో డెలివరీ అయ్యే అవకాశం ఉన్నందున.. బిడ్డకు జన్మనిచ్చి అనంతరం ఆ శిశువును దత్తతకు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని వైద్యులు సూచించారు.

ఎయిమ్స్ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి కోర్టులో వాదనలు వినిపిస్తూ.. “ఎంతో ఆవేదనతో ఈ పిటిషన్‌ను దాఖలు చేస్తున్నామని.. ఇదంతా ఆ మైనర్ బాలిక క్షేమం కోసమేనని” వెల్లడించారు. ఇష్టం లేకుండా ఒక మహిళ లేదా ఒక బాలిక గర్భాన్ని కొనసాగించాలని బలవంతం చేయలేమని గతంలోనే స్పష్టం చేసిన సుప్రీంకోర్టు.. ఇప్పుడు వైద్యుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని మధ్యేమార్గాన్ని అన్వేషిస్తోంది. వైద్యపరమైన చిక్కులు.. బాధితురాలి హక్కుల మధ్య సమతుల్యత పాటించాల్సిన అవసరాన్ని న్యాయస్థానం నొక్కి చెప్పింది.

Advertisement

ఈ ఉదంతం దేశంలో గర్భవిచ్ఛిత్తి చట్టాల (MTP Act) పరిమితులపై మరోసారి చర్చకు దారితీసింది. అత్యాచార బాధితులు గర్భం దాల్చినప్పుడు గడువు దాటిన తర్వాత కూడా వారికి సురక్షితమైన వైద్య సేవలు అందేలా చట్టాల్లో మార్పులు తేవాలని సుప్రీంకోర్టు కేంద్రానికి దిశానిర్దేశం చేసింది. బాధితురాలి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ కేసులో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Read Also: Amaravati: ప్రజల కంటే అమరావతికే ప్రయార్టీ.. కష్టాలు పట్టించుకోకుంటే గుణపాఠం తప్పదని షర్మిల హెచ్చరిక

Related News

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. ఉత్తరాఖండ్‌లో హిమానీనదాల మాటేంటి? ముప్పు పొంచివుందా?

ప్రధాని మోదీ మరోసారి విజ్ఞప్తి.. బంగారం కొనుగోళ్లపై కీలక వ్యాఖ్యలు, స్వదేశీ మంత్రంతోపాటు

Big Stories

Advertisement
×