E-Paper
Advertisement

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం
Advertisement

Supreme Court: పెళ్లి చేసుకున్న జంటలకే కాకుండా.. వివాహ బంధం లాంటి సహజీవనంలో ఉండే మహిళలకు కూడా గృహ హింస నిరోధక చట్టాలు వర్తిస్తాయని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. భాగస్వామిని వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో సాగించే సహజీవనంలో మహిళలపై క్రూరత్వానికి పాల్పడితే.. భారత శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 498A కింద పురుషుడిపై నేరారోపణ మోపి విచారించవచ్చని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ‘లోకేష్ vs కర్ణాటక ప్రభుత్వం’ కేసులో ఈ చారిత్రాత్మక తీర్పును వెలువరించింది.

అయితే, అన్ని రకాల సహజీవన బంధాలకూ ఈ శిక్షాస్మృతి నిబంధన వర్తించదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తాము పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఒకే ఇంట్లో కలసి ఉన్నామని నిరూపించాల్సిన ప్రాథమిక బాధ్యత రక్షణ కోరే మహిళపైనే ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. మరోవైపు సామాజిక మార్పులకు అనుగుణంగా చట్టాలు కూడా స్పందించాల్సి ఉంటుందని.. గృహ హింసను నిరోధించే క్రమంలో వివాహిత మహిళలకు, వివాహం లాంటి బంధంలో ఉన్న మహిళలకు మధ్య వ్యత్యాసం చూపడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు)ను ఉల్లంఘించడమే అవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది.

Advertisement

Also Read: సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేసు వివరాల్లోకి వెళ్తే.. డాక్టర్ లోకేష్ బి.హెచ్ అనే వ్యక్తి.. తనకు ఇదివరకే పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టి ఒక మహిళను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత సదరు మహిళపై అదనపు కట్నం కోసం వేధింపులకు దిగి, ఆమెను తగలబెట్టడానికి ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో బాధితురాలు ఫిర్యాదుతో పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. అయితే తమ మధ్య జరిగిన రెండో పెళ్లి చట్టబద్ధంగా చెల్లదు కాబట్టి.. తాము ‘భార్యాభర్తలు’ కామని.. అందువల్ల తనపై సెక్షన్ 498A వర్తించదని లోకేష్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేయడంతో.. ఆయన సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. సుప్రీంకోర్టు కూడా పిటిషనర్ వాదనను తోసిపుచ్చింది.

Advertisement

Also Read: యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

Tags

Related News

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

గ్యాస్ సబ్సిడీ కోసం వెళ్తే.. ఖాతాలో రూ. 100 కోట్లు.. నివ్వెరపోయిన పేద మహిళ!

Big Stories

Advertisement
×