E-Paper
Advertisement

Terrorist Attack : జమ్మూలో ఉగ్రవాదుల దాడి.. ముగ్గురు జవాన్లు మృతి..

Terrorist Attack : జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో సూరన్ కోట్ ప్రాంతంలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. జవాన్లు ప్రయాణిస్తున్న ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు మెరుపు దాడికి దిగారు.

Terrorist Attack : జమ్మూలో ఉగ్రవాదుల దాడి.. ముగ్గురు జవాన్లు మృతి..

Terrorist Attack : జమ్మూ కాశ్మీర్ లోని పూంఛ్ జిల్లా సూరన్ కోట్ ప్రాంతంలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. జవాన్లు ప్రయాణిస్తున్న ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు మెరుపు దాడికి దిగారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందినట్లు ఉన్నధికారులు వెల్లడించారు. మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన జవాన్లను స్థానికి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అదనపు సైనిక బలగాలను పంపించినట్లు ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు.

ప్రస్తుతం ఉగ్రవాదులు, జవాన్ల మధ్య కాల్పులు జరుగున్నట్లు సమాచారం. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రాంతంలో ఉగ్రదాడి జరగడం ఈ నెలలో రెండోసారి కావడం గమనార్హం. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతం ఉగ్రవాదులకు నిలయంగా మారింది. దీంతో సైన్యంపై ఎక్కువుగా దాడులు జరుగుతున్నాయి.


ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో రాజౌరీ-పూంచ్ ప్రాంతంలో జరిగిన దాడుల్లో 10 మంది సైనికులు మరిణించారు. గత రెండేళ్లలో ఈ ప్రాంతంలో యాంటీ టెర్రర్ ఆపరేషన్లలో 35 మంది సైనికులు అమరులు అయ్యారు.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×