BigTV English

Terrorist Attack : జమ్మూలో ఉగ్రవాదుల దాడి.. ముగ్గురు జవాన్లు మృతి..

Terrorist Attack : జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో సూరన్ కోట్ ప్రాంతంలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. జవాన్లు ప్రయాణిస్తున్న ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు మెరుపు దాడికి దిగారు.

Terrorist Attack : జమ్మూలో ఉగ్రవాదుల దాడి.. ముగ్గురు జవాన్లు మృతి..

Terrorist Attack : జమ్మూ కాశ్మీర్ లోని పూంఛ్ జిల్లా సూరన్ కోట్ ప్రాంతంలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. జవాన్లు ప్రయాణిస్తున్న ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు మెరుపు దాడికి దిగారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందినట్లు ఉన్నధికారులు వెల్లడించారు. మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన జవాన్లను స్థానికి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అదనపు సైనిక బలగాలను పంపించినట్లు ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు.


ప్రస్తుతం ఉగ్రవాదులు, జవాన్ల మధ్య కాల్పులు జరుగున్నట్లు సమాచారం. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రాంతంలో ఉగ్రదాడి జరగడం ఈ నెలలో రెండోసారి కావడం గమనార్హం. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతం ఉగ్రవాదులకు నిలయంగా మారింది. దీంతో సైన్యంపై ఎక్కువుగా దాడులు జరుగుతున్నాయి.


ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో రాజౌరీ-పూంచ్ ప్రాంతంలో జరిగిన దాడుల్లో 10 మంది సైనికులు మరిణించారు. గత రెండేళ్లలో ఈ ప్రాంతంలో యాంటీ టెర్రర్ ఆపరేషన్లలో 35 మంది సైనికులు అమరులు అయ్యారు.


Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×