E-Paper
Advertisement

Batti vikramarka: ఏ ప్రాజెక్టు ఎవరు నిర్మించారో ప్రజలకు తెలుసు..వాస్తవాలు తెలియాలనే శ్వేతపత్రం ..

Batti vikramarka

Batti vikramarka: ఏ ప్రాజెక్టు ఎవరు నిర్మించారో ప్రజలకు తెలుసు..వాస్తవాలు తెలియాలనే శ్వేతపత్రం ..
Advertisement

Batti vikramarka: విద్యుత్‌ విషయంలో వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియజేయాలనే శ్వేతపత్రం విడుదల చేశామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. విద్యుత్‌ విషయంలో పలువురు సభ్యులు విలువైన సలహాలు ఇచ్చారన్నారు. డిస్కమ్‌ల నష్టాలకు కారణం ఎవరో, ఏ ప్రాజెక్టు ఎవరి కాలంలో నిర్మించారో ప్రజలకు బాగా తెలుసన్నారు. విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణం రాత్రికి రాత్రే జరిగేవి కాదు, పూర్తి చేయడానికి దాదాపు 4 నుంచి 7 సంవత్సరాలు సమయం పడుతుందని భట్టి విక్రమార్క తెలిపారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే విద్యుత్‌ సమస్య పరిష్కారం కాలేదన్నారు. కాంగ్రెస్‌ చేపట్టిన ప్రాజెక్టులు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి పూర్తయ్యాయన్నారు. కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన విద్యుత్‌ సంస్థల వల్లే బీఆర్ఎస్ నాయకులు విద్యుత్ ను ఇవ్వగలిగారని గుర్తు చేశారు.

Advertisement

రాష్ట్రంలో యాదాద్రి, పవర్ ప్లాంట్ ఆలస్యం కావడం వల్ల దాదాపు రూ.10 వేల కోట్ల భారం పెరిగిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. భద్రాది పవర్ ప్లాంట్ ఆలస్యం కావడం వల్ల 40 శాతం అదనపు వ్యయం పెరిగిందన్నారు.యాదాద్రి, భద్రాద్రి కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు తెచ్చిందా అని ప్రశ్నించారు. ప్రజలను ఇంకా ఎన్నాళ్లు మోసం చేస్తారని హె చ్చరించారు. యాదాద్రి, భద్రాద్రి, చత్తీస్ ఘడ్ ల విద్యుత్ ఒప్పందంతో కలిసి వచ్చిన విద్యుత్ 1000 మెగావాట్లు అని తెలిపారు.

Related News

తెలంగాణ గ్రామ పంచాయతీలకు.. సీక్రేట్ ఆర్డర్స్ జారీ చేసిన సర్కార్..?

Medchal: నడి రోడ్డు పై వరి నాట్లు.. బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన..!

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

Big Stories

Advertisement
×