BigTV English

Ayodhya: అయోధ్య రామజన్మభూమి ఆలయానికి బాంబు బెదిరింపు.. హై అలర్ట్

Ayodhya: అయోధ్య రామజన్మభూమి ఆలయానికి బాంబు బెదిరింపు.. హై అలర్ట్

Ayodhya: యూపీలోని అయోధ్యలో రామజన్మభూమి కాంప్లెక్స్‌కు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపుతోంది. గుర్తుతెలియని వ్యక్తి అయోధ్యలో నివాసం ఉంటున్న మనోజ్ కుమార్ అనే వ్యక్తికి ఫోన్ చేసి రామజన్మభూమి కాంప్లెక్స్‌ను పేల్చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేస్తూ.. భద్రతను కట్టుదిట్టం చేశారు.


అయోధ్యలోని రాంలాలా సదన్‌కు చెందిన మనోజ్‌ కుమార్‌కు ఈ ఉదయం ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. మరికొన్ని గంటల్లో శ్రీరామజన్మభూమి కాంప్లెక్స్‌ను బాంబుతో పేల్చేస్తామని బెదిరించి ఫోన్ కట్ చేశాడు. ఆ తర్వాత మనోజ్ ఎన్నిసార్లు చేసినా ఫోన్ స్విఛ్ఛాఫ్ రావడంతో పోలీసులకు సమాచారం అందించాడు.

నిందితుడి కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. కాల్ ట్రాకింగ్ ఆధారంగా నిందితుడిని అతి త్వరలో గుర్తించి అరెస్ట్ చేస్తామని వెల్లడించారు.


ఇక ఆలయ నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి పనులు పూర్తి చేసి.. భక్తులకు రాములోరి దర్శనం కల్పిస్తామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×