E-Paper
Advertisement

Kedarnath Yatra: కేథార్ నాథ్ యాత్రలో విషాదం.. కొండచరియలు విరిగి ముగ్గురు మృతి

Kedarnath Yatra: కేథార్ నాథ్ యాత్రలో విషాదం.. కొండచరియలు విరిగి ముగ్గురు మృతి

Kedarnath Yatra: ఛార్ థామ్ యాత్రలలో ఒకటైన కేదార్ నాథ్ యాత్రలో విషాద ఘటన జరిగింది. కొండచరియలు విరిగి పడటంతో ముగ్గురు యాత్రికులు మృతి చెందారు. గౌరీకుండ్ – చిర్బాసా మధ్యలో కొండ చరియలు విరిగి పడటంతో ముగ్గురు భక్తులు మరణించగా.. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఒక వ్యక్తిని రుద్రప్రయాగ్ జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు.

ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడినవారిని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

గౌరీకుండ్ – కేదార్ నాథ్ ట్రెక్కింగ్ మార్గంలో ఉన్న చిద్వాసా ప్రాంతానికి సమీపంలో ఆదివారం ఉదయం సుమారు ఏడున్నర గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు రుద్రప్రయాగ్ జిల్లా విపత్తు నిర్వహణ అధికారి నందన్ సింగ్ రాజ్వర్ వెల్లడించారు. భారీ వర్షాలకు శిథిలాలు, కొండపై రాళ్లు విరిగిపడ్డాయని తెలిపారు. ఇప్పటికే భారీ వర్షాలకు అనేక ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిన్నాయి. అధికారులు వాటిని పునరుద్ధరించేలా చర్యలు చేపట్టారు.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×