BigTV English

Kedarnath Yatra: కేథార్ నాథ్ యాత్రలో విషాదం.. కొండచరియలు విరిగి ముగ్గురు మృతి

Kedarnath Yatra: కేథార్ నాథ్ యాత్రలో విషాదం.. కొండచరియలు విరిగి ముగ్గురు మృతి

Kedarnath Yatra: ఛార్ థామ్ యాత్రలలో ఒకటైన కేదార్ నాథ్ యాత్రలో విషాద ఘటన జరిగింది. కొండచరియలు విరిగి పడటంతో ముగ్గురు యాత్రికులు మృతి చెందారు. గౌరీకుండ్ – చిర్బాసా మధ్యలో కొండ చరియలు విరిగి పడటంతో ముగ్గురు భక్తులు మరణించగా.. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఒక వ్యక్తిని రుద్రప్రయాగ్ జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు.


ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడినవారిని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

గౌరీకుండ్ – కేదార్ నాథ్ ట్రెక్కింగ్ మార్గంలో ఉన్న చిద్వాసా ప్రాంతానికి సమీపంలో ఆదివారం ఉదయం సుమారు ఏడున్నర గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు రుద్రప్రయాగ్ జిల్లా విపత్తు నిర్వహణ అధికారి నందన్ సింగ్ రాజ్వర్ వెల్లడించారు. భారీ వర్షాలకు శిథిలాలు, కొండపై రాళ్లు విరిగిపడ్డాయని తెలిపారు. ఇప్పటికే భారీ వర్షాలకు అనేక ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిన్నాయి. అధికారులు వాటిని పునరుద్ధరించేలా చర్యలు చేపట్టారు.


Related News

Cough Syrup: దగ్గు మందు మరణాలు.. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు

IAF Chief: అవన్నీ కట్టుకథలు.. ఆపరేషన్ సింధూర్‌పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ కీలక వ్యాఖ్యలు

No Internet: 2 గంటలు ఇంటర్నెట్ బంద్, రోడ్లపైకి పోలీసు బలగాలు.. అసలు ఏం జరుగుతోంది?

Tomato virus: పిల్లల్లో టమాటా వైరస్.. ఇది ఎలా వ్యాప్తి చెందుతోంది? లక్షణాలేమిటీ?

Rajasthan News: రాజస్థాన్‌లో దగ్గు సిరప్ చిచ్చు.. టెస్ట్ చేసిన డాక్టర్‌కి ఏమైంది?

Rabi Crops MSP Hike: పండుగ రోజు రైతులకు గుడ్ న్యూస్.. ఈ ఆరు పంటల మద్దతు ధరలు పెంపు

Bengaluru metro: మెట్రోలో తిట్టుకున్న మహిళామణులు.. హిందీలో మాట్లాడినందుకు రచ్చ రచ్చ

First 3D Printed House: దేశంలో తొలి త్రీడీ ప్రింటెడ్ ఇల్లు.. కేంద్రమంత్రి ప్రారంభం, తక్కువ ఖర్చు కూడా

Big Stories

×