BigTV English

Kedarnath Yatra: కేథార్ నాథ్ యాత్రలో విషాదం.. కొండచరియలు విరిగి ముగ్గురు మృతి

Kedarnath Yatra: కేథార్ నాథ్ యాత్రలో విషాదం.. కొండచరియలు విరిగి ముగ్గురు మృతి

Kedarnath Yatra: ఛార్ థామ్ యాత్రలలో ఒకటైన కేదార్ నాథ్ యాత్రలో విషాద ఘటన జరిగింది. కొండచరియలు విరిగి పడటంతో ముగ్గురు యాత్రికులు మృతి చెందారు. గౌరీకుండ్ – చిర్బాసా మధ్యలో కొండ చరియలు విరిగి పడటంతో ముగ్గురు భక్తులు మరణించగా.. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఒక వ్యక్తిని రుద్రప్రయాగ్ జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు.


ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడినవారిని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

గౌరీకుండ్ – కేదార్ నాథ్ ట్రెక్కింగ్ మార్గంలో ఉన్న చిద్వాసా ప్రాంతానికి సమీపంలో ఆదివారం ఉదయం సుమారు ఏడున్నర గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు రుద్రప్రయాగ్ జిల్లా విపత్తు నిర్వహణ అధికారి నందన్ సింగ్ రాజ్వర్ వెల్లడించారు. భారీ వర్షాలకు శిథిలాలు, కొండపై రాళ్లు విరిగిపడ్డాయని తెలిపారు. ఇప్పటికే భారీ వర్షాలకు అనేక ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిన్నాయి. అధికారులు వాటిని పునరుద్ధరించేలా చర్యలు చేపట్టారు.


Related News

Indian Air Force: పాకిస్తాన్ ని ఇలా చావుదెబ్బ కొట్టాం.. ఆపరేషన్ సిందూర్ అరుదైన వీడియో

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Big Stories

×