BigTV English
Advertisement

Khedkar’s IAS training put on hold: పూజా ఖేడ్కర్‌కు భారీ షాక్.. ఐఏఎస్ ట్రైనింగ్ నిలుపుదల

Khedkar’s IAS training put on hold: పూజా ఖేడ్కర్‌కు భారీ షాక్.. ఐఏఎస్ ట్రైనింగ్ నిలుపుదల

puja khedkar’s IAS training put on hold: ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేడ్కర్ కు భారీ షాక్ తగిలింది. ఆమెపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. మహారాష్ట్రలో ఆమె ట్రైనింగ్ ను నిలిపివేశారు. ఈ మేరకు ముస్సూరిలోని లాల్ బహదూర్ శాస్త్రీ నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ రీకాల్ ఉత్తర్వులను జారీ చేసింది. పలు వివాదాలకు ఆమె కేంద్ర బిందువుగా మారడంతో ఆమెపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అడ్డదారుల్లో ఆమె ఐఏఎస్ ఉద్యోగం పొందారంటూ ఆరోపణలు వస్తున్న క్రమంలో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఆమె ట్రైనింగ్ ను నిలుపుదల చేసి తిరిగి ముస్సూరిలోని లాల్ బహదూర్ శాస్త్రీ నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కు రావాలంటూ ఆదేశాలు జారీ చేశారు.


సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఎంపికయ్యేందుకు వైకల్యం, ఓబీసీ సర్టిఫికేట్లను తారుమారు చేసిందంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో పూజా ఖేడ్కర్ శిక్షణను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అందులో పేర్కొన్నది. అవసరమైన తదుపరి చర్యల నిమిత్తం ఖేడ్కర్ ను జులై 23లోగా అకాడమీకి రావాల్సిందిగా పేర్కొన్నది.

Also Read: కాంచన్‌జంగా రైలు ప్రమాదానికి కారణం ‘వాకీ-టాకీల కొరత’..?


అయితే, ఐఏఎస్ ఉద్యోగంలో చేరేందుకు ఆమె తప్పుడు పత్రాలు సమర్పించినట్లు భారీగా ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. 2018, 2021లో అహ్మద్ నగర్ జిల్లా సివిల్ హాస్పిటల్ అందించిన రెండు సర్టిఫికెట్లను బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ కేటగిరీ కింద యూపీఎస్సీకి పూజా ఖేడ్కర్ సమర్పించింది. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షల కోసం ఆమెను ఢిల్లీలోని ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కు యూపీఎస్సీ సిఫార్సు చేసింది. కానీ, ఆమె మాత్రం ఏప్రిల్, 2022 నుంచి ఆగస్టు వరకు ఆరుసార్లు మెడికల్ టెస్టులకు వెళ్లలేదు.

Tags

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×