E-Paper
Advertisement

Aadhaar News: ఆధార్ కీలక అప్‌డేట్.. ఫోన్ లింక్, ఇకపై కార్డు అవసరం లేదు

Aadhaar News: ఆధార్ కీలక అప్‌డేట్.. ఫోన్ లింక్, ఇకపై కార్డు అవసరం లేదు

Aadhaar News: ఆధార్ పేరు చెబితే చాలు చాలామంది భయపడుతుంటారు. సైబర్ క్రైమ్స్ నేపథ్యంలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ- యూఐడీఏఐ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని బెంబేలెత్తుతున్నారు సామాన్యులు. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది ఆ సంస్థ. ఆధార్‌తో మొబైల్ నెంబర్ లింకుపై కీలక ప్రకటన చేసింది. ఎక్కడి నుంచైనా మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేసుకోవచ్చు.

ఆధార్ కార్డు కీలక అప్‌డేట్

ఆధార్ కార్డు‌కి మొబైల్ నెంబర్ లింక్ చేయడం తప్పనిసరి చేసింది కేంద్రం. ఈ విషయంలో బయో మెట్రిక్స్, అడ్రస్ ప్రూఫ్, యూజర్ గుర్తింపు ధ్రువీకరణకు కేంద్రం అనుమతి ఇచ్చింది. మొబైల్ నెంబర్‌కు ఆధార్ లింక్ చేయాలని ఇటీవల ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే లింక్ చేశారు.. చేస్తున్నారు కూడా.

ఈ సేవలు మరింత సరళతరం చేయడానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎక్కడి నుంచైనా మొబైల్ నెంబర్‌ని అప్‌డేట్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. అందుకోసం త్వరలో కొత్త వ్యవస్థ రానుంది. దీనివల్ల ఆధార్ సేవలను మరింత సులభంగా వినియోగించుకోవడం దీని ఉద్దేశం. జనవరి 28 తర్వాత ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది.

ఇకపై కార్డు అవసరం లేదు, ఇంటి నుంచి చేసుకోవచ్చు

రిపబ్లిక్ డే వేడుక పూర్తికావడంతో కొత్త ఆధార్ యాప్ అందుబాటులోకి తీసుకురానుంది యూఐడీఏఐ. కొత్త ఆధార్ యాప్ పూర్తి వెర్షన్‌ను ప్రారంభించనుంది. ఆధార్ వాడకాన్ని సులభతరం చేయడానికి ఈ యాప్ రూపొందించింది. అవసరమైన చోటకు వినియోగదారులు వారి ఆధార్ కార్డ్ లేదా ఫోటోకాపీలను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటి నుండే వారి మొబైల్ నంబర్, చిరునామాను అప్‌డేట్ చేసుకోవచ్చు.

యాప్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత వినియోగదారులు ఆధార్‌తో లింక్ చేయబడిన మొబైల్ నెంబర్ నంబర్‌ను ఉపయోగించి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత ఆధార్ కార్డు యాప్ లోపల వివరాలు కనిపిస్తాయి. అవసరమైనప్పుడు వినియోగదారులు తమ ఫోన్‌లో చూపించవచ్చు. ఆధార్‌ ఎవరితోనైనా పంచుకునేటప్పుడు పూర్తి చిరునామా లేదా పుట్టిన తేదీ వంటి వ్యక్తిగత వివరాలు దాచవచ్చు. దుర్వినియోగాన్ని తగ్గిస్తుంది.

ALSO READ: భారత్, ఈయూ మధ్య కుదిరిన ట్రేడ్ డీల్.. ప్రధాని మోదీ కీలక ప్రకటన

మీ ఫోన్‌లో సురక్షితంగా ఉంటుంది కూడా. ఈ యాప్ Android, iOS వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, హోటళ్ళు, ఇతర ధృవీకరణ ప్రదేశాలలో తనిఖీలకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. దీనివల్ల ప్రతి కుటుంబ సభ్యునికి ప్రత్యేక గుర్తింపు పత్రాలను సమర్పించాల్సిన అవసరం ఉండదు.

కొత్త ఆధార్ యాప్‌లో అత్యంత ఉపయోగకరమైంది. ఇంటి నుంచి వివరాలు అప్‌డేట్ చేసుకోవచ్చు. వినియోగదారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌ను యాప్ లోపల నేరుగా మార్చుకోగలరు. ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. దీనికి సంబంధించిన ప్రక్రియను సులభమైన దశల్లో ఆన్‌లైన్‌లో పూర్తి చేసుకోవచ్చు.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×