India EU Trade Deal:భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(FTA) కుదిరింది. ట్రేడ్ డీల్ పై సోమవారం సంతకాలు చేశామని ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు.
“నిన్న యూరోపియన్ యూనియన్, భారత్ ఒక పెద్ద ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీనిని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని పిలుస్తున్నారు. ఈ ఒప్పందం భారత్, యూరప్ మధ్య వాణిజ్య అవకాశాలను మరింత మెరుగుపరుస్తాయి. ప్రపంచంలోని రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థల మధ్య కీలక భాగస్వామ్యానికి ఇది ఒక ముఖ్య ఉదాహరణ. ఈ ఒప్పందం ప్రపంచ GDPలో 25 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 1/3 వంతుకు ప్రాతినిధ్యం వహిస్తుంది” అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
భారత్-ఈయూ ఒప్పందం ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలనను శక్తివంతం చేస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. యూరోపియన్ యూనియన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం బ్రిటన్, ఈఎఫ్టీఏ ఒప్పందాలను కూడా కలిగి ఉందన్నారు. ఈయూ కమిషన్ చీఫ్ఉర్సులా వాన్ డెర్ లేయెన్ మాట్లాడుతూ.. ఈ ఒప్పందంతో భారత్, ఐరోపా మధ్య స్నేహం మరింత బలపడుతుందన్నారు.
Also Read: ఈయూ దేశాలకు పెరిగిన భారత్ డీజిల్ ఎగుమతులు