E-Paper
Advertisement

Union Cabinet: 70 ఏళ్లు పైబడినవారికి గొప్ప శుభవార్త.. ఉచితంగా రూ. 5 లక్షలు..

Union Cabinet: 70 ఏళ్లు పైబడినవారికి గొప్ప శుభవార్త.. ఉచితంగా రూ. 5 లక్షలు..
Advertisement

Union Cabinet Decisions: కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు అంశాలపై చర్చింది. అనంతరం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ మీటింగ్ అనంతరం కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ కేబినెట్ మీటింగ్, డెసిషన్స్ వివరాలను తెలియజేశారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. 70 ఏళ్లు పైబడిన సిటిజన్లకు సైతం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా, 70 ఏళ్లు పైబడిన వారికి ఈ పథకాన్ని వర్తింపజేస్తూ తీసుకున్న ఈ నిర్ణయంలో గొప్ప మానవతా దృక్పథం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వారంతా రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స సౌకర్యాన్ని పొందొచ్చన్నారు. ఈ నిర్ణయం వల్ల దాదాపుగా 6 కోట్లకు పైగా సీనియర్ సిటిజన్స్ లబ్ధి పొందనున్నారన్నారు.

Also Read: మేము ఉన్నంత వరకూ.. దానిని టచ్ కూడా చేయలేరు : రాహుల్ వ్యాఖ్యలపై అమిత్ షా స్పందన

Advertisement

ఇదిలా ఉంటే.. ప్రతిష్ఠాత్మక ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని 2018 సెప్టెంబర్ లో కేంద్ర ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది. ఈ పథకం కింద దేశంలోని పేద కుటుంబాలకు ఆయుష్మాన్ కార్డును అందిస్తుంది. ఈ కార్డుతో ఆసుపత్రిలో చేరినప్పుడు రూ. 5 లక్షల వరకు ఉచితంగా వైద్య సేవలు అందుతాయి.

 

Tags

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×