E-Paper
Advertisement

Union Cabinet: 70 ఏళ్లు పైబడినవారికి గొప్ప శుభవార్త.. ఉచితంగా రూ. 5 లక్షలు..

Union Cabinet: 70 ఏళ్లు పైబడినవారికి గొప్ప శుభవార్త.. ఉచితంగా రూ. 5 లక్షలు..

Union Cabinet Decisions: కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు అంశాలపై చర్చింది. అనంతరం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ మీటింగ్ అనంతరం కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ కేబినెట్ మీటింగ్, డెసిషన్స్ వివరాలను తెలియజేశారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. 70 ఏళ్లు పైబడిన సిటిజన్లకు సైతం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా, 70 ఏళ్లు పైబడిన వారికి ఈ పథకాన్ని వర్తింపజేస్తూ తీసుకున్న ఈ నిర్ణయంలో గొప్ప మానవతా దృక్పథం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వారంతా రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స సౌకర్యాన్ని పొందొచ్చన్నారు. ఈ నిర్ణయం వల్ల దాదాపుగా 6 కోట్లకు పైగా సీనియర్ సిటిజన్స్ లబ్ధి పొందనున్నారన్నారు.

Also Read: మేము ఉన్నంత వరకూ.. దానిని టచ్ కూడా చేయలేరు : రాహుల్ వ్యాఖ్యలపై అమిత్ షా స్పందన

ఇదిలా ఉంటే.. ప్రతిష్ఠాత్మక ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని 2018 సెప్టెంబర్ లో కేంద్ర ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది. ఈ పథకం కింద దేశంలోని పేద కుటుంబాలకు ఆయుష్మాన్ కార్డును అందిస్తుంది. ఈ కార్డుతో ఆసుపత్రిలో చేరినప్పుడు రూ. 5 లక్షల వరకు ఉచితంగా వైద్య సేవలు అందుతాయి.

 

Tags

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×