E-Paper
Advertisement

Edcucation policy: నో- డిటెన్షన్ రద్దు.. టీచర్లకు టెన్షన్, ఫెయిలైతే మళ్లీ..

Edcucation policy: నో- డిటెన్షన్ రద్దు.. టీచర్లకు టెన్షన్, ఫెయిలైతే మళ్లీ..
Advertisement

Edcucation policy: ప్రైమరీ ఎడ్యుకేషన్‌కు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై స్కూళ్లలో నో డిటెన్షన్ పాలసీని రద్దు చేసింది. ముఖ్యంగా 5, 8 తరగతులకు మాత్రమే. పై తరగతులకు వెళ్లే ముందు కచ్చితంగా ఈ రెండు క్లాసుల్లో విజయం సాధించాలి. దీంతో విద్యార్థులు పాసయ్యే భారం ఇకపై ఉపాధ్యాయులపై పడనుంది.

పాఠశాల విద్యకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం. నో-డిటెన్షన్ విధానం రద్దు చేసింది. తొలి విడతగా కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్ పాఠశాలల్లో నో- డిటెన్షన్ విధానం రద్దు చేసింది. ఇకపై వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని 5, 8 తరగతుల విద్యార్థులు మళ్లీ అదే తరగతుల్లో చదవాల్సి ఉంటుంది.

Advertisement

విద్యాహక్కు చట్టం- 2019 సవరణ చేసింది కేంద్రప్రభుత్వం. దాని ప్రకారం దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే ఈ రెండు తరగతులకు నో డిటెన్షన్ విధానాన్ని తొలగించాయని వెల్లడించింది. పరీక్షల్లో విద్యార్థి పైతరగతులకు ప్రమోట్ కావడంలో విఫలమైతే.. మళ్లీ పరీక్ష రాసేందుకు రెండు నెలల సమయం కేటాయించింది.

రీ-ఎగ్జామ్‌లో ఫెయిల్ అయితే సదరు విద్యార్థులు మళ్లీ ఆయా తరగతుల్లో చదవాల్సి ఉంటుంది. ఎలిమెంటరీ విద్య పూర్తయినంత వరకు ఏ విద్యార్థినీ బహిష్కరించరాదన్నది మరో కీలక పాయింట్. తీసుకొచ్చిన కొత్త విధానం కేంద్ర ప్రభుత్వ పరిధిలో దాదాపు 3 వేల కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్ పాఠశాలలకు వర్తించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

Advertisement

ALSO READ: కేజ్రీవాల్, ఆప్ సర్కారుపై బీజేపీ ఛార్జిషీట్.. అందులో ఉన్నది ఇదే!

కొత్త విద్యా విధానం ప్రకారం మిగతా పాఠశాలలకు వర్తింపనుంది. చాలా రాష్ట్రాలు కొత్తగా సీబీఎస్ఈ పాఠశాలలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాలు ముందు ఉన్నాయనే చెప్పవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే భారమంతా టీచర్లపై ఉంటుందన్నమాట.

ఇప్పటివరకు పరీక్షల్లో పాసైనా, ఫెయిల్ అయినా హాజరు శాతంతో పై తరగతులకు పంపిస్తున్నారు. ఇప్పుడు ఆ పద్దతి పోనుంది. సీబీఎస్ఈ స్కూళ్లయితే కొత్త విధానం అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ప్రాథమిక విద్య రాష్ట్ర జాబితాలో అంశం కావడంతో దీనిపై ఆయా రాష్ట్రాలు చర్చించి నిర్ణయం తీసుకోనున్నాయి.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×