E-Paper
Advertisement

Edcucation policy: నో- డిటెన్షన్ రద్దు.. టీచర్లకు టెన్షన్, ఫెయిలైతే మళ్లీ..

Edcucation policy: నో- డిటెన్షన్ రద్దు.. టీచర్లకు టెన్షన్, ఫెయిలైతే మళ్లీ..

Edcucation policy: ప్రైమరీ ఎడ్యుకేషన్‌కు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై స్కూళ్లలో నో డిటెన్షన్ పాలసీని రద్దు చేసింది. ముఖ్యంగా 5, 8 తరగతులకు మాత్రమే. పై తరగతులకు వెళ్లే ముందు కచ్చితంగా ఈ రెండు క్లాసుల్లో విజయం సాధించాలి. దీంతో విద్యార్థులు పాసయ్యే భారం ఇకపై ఉపాధ్యాయులపై పడనుంది.

పాఠశాల విద్యకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం. నో-డిటెన్షన్ విధానం రద్దు చేసింది. తొలి విడతగా కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్ పాఠశాలల్లో నో- డిటెన్షన్ విధానం రద్దు చేసింది. ఇకపై వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని 5, 8 తరగతుల విద్యార్థులు మళ్లీ అదే తరగతుల్లో చదవాల్సి ఉంటుంది.

విద్యాహక్కు చట్టం- 2019 సవరణ చేసింది కేంద్రప్రభుత్వం. దాని ప్రకారం దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే ఈ రెండు తరగతులకు నో డిటెన్షన్ విధానాన్ని తొలగించాయని వెల్లడించింది. పరీక్షల్లో విద్యార్థి పైతరగతులకు ప్రమోట్ కావడంలో విఫలమైతే.. మళ్లీ పరీక్ష రాసేందుకు రెండు నెలల సమయం కేటాయించింది.

రీ-ఎగ్జామ్‌లో ఫెయిల్ అయితే సదరు విద్యార్థులు మళ్లీ ఆయా తరగతుల్లో చదవాల్సి ఉంటుంది. ఎలిమెంటరీ విద్య పూర్తయినంత వరకు ఏ విద్యార్థినీ బహిష్కరించరాదన్నది మరో కీలక పాయింట్. తీసుకొచ్చిన కొత్త విధానం కేంద్ర ప్రభుత్వ పరిధిలో దాదాపు 3 వేల కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్ పాఠశాలలకు వర్తించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

ALSO READ: కేజ్రీవాల్, ఆప్ సర్కారుపై బీజేపీ ఛార్జిషీట్.. అందులో ఉన్నది ఇదే!

కొత్త విద్యా విధానం ప్రకారం మిగతా పాఠశాలలకు వర్తింపనుంది. చాలా రాష్ట్రాలు కొత్తగా సీబీఎస్ఈ పాఠశాలలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాలు ముందు ఉన్నాయనే చెప్పవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే భారమంతా టీచర్లపై ఉంటుందన్నమాట.

ఇప్పటివరకు పరీక్షల్లో పాసైనా, ఫెయిల్ అయినా హాజరు శాతంతో పై తరగతులకు పంపిస్తున్నారు. ఇప్పుడు ఆ పద్దతి పోనుంది. సీబీఎస్ఈ స్కూళ్లయితే కొత్త విధానం అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ప్రాథమిక విద్య రాష్ట్ర జాబితాలో అంశం కావడంతో దీనిపై ఆయా రాష్ట్రాలు చర్చించి నిర్ణయం తీసుకోనున్నాయి.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×