BigTV English

BJP vs AAP: కేజ్రీవాల్, ఆప్ సర్కారుపై బీజేపీ ఛార్జిషీట్.. అందులో ఉన్నది ఇదే!

BJP vs AAP: కేజ్రీవాల్, ఆప్ సర్కారుపై బీజేపీ ఛార్జిషీట్.. అందులో ఉన్నది ఇదే!

కేజ్రీవాల్, ఆప్ సర్కారుపై బీజేపీ ఛార్జిషీట్
ఆప్ ప్రభుత్వంలో అన్నీ కుంభకోణాలే
కేజ్రీవాల్ అవినీతికి కొత్త ప్రమాణాలు తీసుకొచ్చారు
అవినీతి కాలుష్యం నుంచి ఢిల్లీని కాపాడుదాం
ఆప్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన బీజేపీ
ఛార్జిషీట్ విడుదల చేసిన ఢిల్లీ ప్రధాన ప్రతిపక్షం
బీజేపీకి ఎలాంటి అజెండా లేదన్న కేజ్రీవాల్


న్యూఢిల్లీ, స్వేచ్ఛ: BJP vs AAP: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీలో రాజకీయాలు హీటెక్కాయి. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారధ్యంలోని ఆప్.. ప్రధాన ప్రతిపక్షం బీజేపీ పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆప్ సర్కారు, కేజ్రీవాల్ లక్ష్యంగా బీజేపీ చార్జిషీట్‌‌ విడుదల చేసింది. కేజ్రీవాల్ అవినీతి కాలుష్యం నుంచి ఢిల్లీని రక్షించాలని ఓటర్లను కోరింది. గతంలో అన్నా హజారేను ముందుపెట్టి కాంగ్రెస్ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపిన కేజ్రీవాల్.. నేడు అవినీతికి కొత్త ప్రమాణాలను తీసుకొచ్చారంటూ ఆరోపణలు గుప్పించింది. ఢిల్లీలోని పాఠశాలలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారని, కానీ ఏకంగా 2 లక్షల మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారని బీజేపీ ఆరోపించింది.

ఢిల్లీలో 24 గంటలపాటు మంచినీరు సరఫరా చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ హామీ ఇచ్చింది, కానీ ఢిల్లీ జనమంతా ట్యాంకర్ల ద్వారా నీటిని డబ్బులు వెచ్చించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని బీజేపీ విమర్శించింది. ఢిల్లీలో రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతోందని, దీనికి ఆప్ ప్రభుత్వ విధానాలే కారణమని నిందించింది. యమునా నదిని శుద్ధి చేయటంలో కేజ్రీవాల్ విఫలమయ్యారంటూ బీజేపీ ఆరోపించింది. అందరికీ మంచినీరు అందించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ‘జల్ జీవన్ మిషన్’కు ఢిల్లీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని పేర్కొంది. కేజ్రీవాల్ హయాంలో వాటర్ బోర్డు కుంభకోణం, క్లాస్ రూమ్ కుంభకోణం, మొహల్లా క్లినిక్ కుంభకోణం, వక్ఫ్ కుంభకోణం, లిక్కర్ కుంభకోణం, డీటీసీ కుంభకోణం ఇలా ఎన్నో స్కామ్‌లు జరిగాయని మండిపడింది.


Also Read: CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఒక్క ఐడియా.. వారి లైఫ్ ని మార్చేసింది!

బీజేపీకి అజెండా లేదు: కేజ్రీవాల్
బీజేపీ విడుదల చేసిన ఛార్జిషీటుపై కేజ్రీవాల్ స్పందించారు. ఢిల్లీ విషయంలో బీజేపీకి ఎలాంటి అజెండా లేదని, ఆ పార్టీకి కనీసం సీఎం అభ్యర్థి కూడా లేరని మండిపడ్డారు. తనను ఏవిధంగా వేధించాలనే విషయం మాత్రమే బీజేపీకి తెలుసని ఆగ్రహం వ్యక్తం చేవారు. కాగా, కేజ్రీవాల్ అవినీతికి పాల్పడ్డారంటూ బీజేపీ ప్రచారాస్త్రంగా మార్చుకున్న విషయం తెలిసిందే

Related News

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Big Stories

×