E-Paper
Advertisement

Uttar Pradesh: భర్తతో గొడవ.. పుట్టింటికి వెళ్తున్న మహిళ చేతులు, కాళ్లు కట్టేసి..

Uttar Pradesh: భర్తతో గొడవ.. పుట్టింటికి వెళ్తున్న మహిళ చేతులు, కాళ్లు కట్టేసి..

Uttar Pradesh: భర్తతో గొడవపడి.. పుట్టింటికి వెళ్తున్న మహిళపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని బరాబంకీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవా ప్రాంతానికి చెందిన మహిళ.. తన భర్తతో గొడవపడి పుట్టింటికి బయల్దేరింది. మార్గం మధ్యలో నలుగురు వ్యక్తులు లిఫ్ట్ ఇస్తామని అడ్డుతగిలారు. ఆమె నిరాకరించడంతో.. కారు డోర్ ఓపెన్ చేసి లోపలికి లాగారు.

ఆమె నోటిలో గుడ్డలు కుక్కి.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. చేతులు, కాళ్లు కట్టేసి సామూహిక అత్యాచారం చేశారు. ఆపై ఆమె ఫోన్ నుంచే ఆమె సోదరికి సమాచారం ఇచ్చి.. పరారయ్యారు. తేరుకున్న బాధితురాలు పోలీసులకు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేసి.. ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఈ కేసులో ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు. స్థానిక పోలీసులు కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తుండటంతో.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిందామె. ఎస్పీ సిన్హా బాధితురాలిని వెంటనే ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించి, మరో నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Related News

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

ఆర్టీసీ బస్సులో గంజాయి దందా.. తనిఖీల్లో పోలీసులకే దిమ్మతిరిగే షాక్!

Big Stories

×