E-Paper
Advertisement

Rachakonda Commissionerate : 2023 క్రైమ్ రిపోర్టు విడుదల.. 25 శాతం పెరిగిన సైబర్ నేరాలు..

Rachakonda Commissionerate : 2023 క్రైమ్ రిపోర్టు విడుదల.. 25 శాతం పెరిగిన సైబర్ నేరాలు..
Advertisement

Rachakonda Commissionerate : రాచకొండ కమిషనరేట్ పరిధిలో నేరాల సంఖ్య పెరిగిందని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు మీడియా ద్వారా వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే 6.8% నేరాల సంఖ్య పెరిగిందని తెలిపారు. గతేడాది 27,664 కేసులు నమోదు అవ్వగా.. ఈ ఏడాది 29,166 కేసులు నమోదయ్యాయన్నారు. సైబర్ క్రైమ్ కేసులు 25 శాతం పెరిగాయని సీపీ తెలిపారు.

చైన్ స్నాచింగ్, అత్యాచారం, సాధారణ దొంగతనాలు కేసులు తగ్గినట్లుగా పేర్కొన్నారు. నగరంలో చిన్నారుల పై లైంగిక దాడుల కేసులు, హత్యలు, కిడ్నాపులు ముందు కంటే పెరిగాయని సీపీ తెలిపారు. డ్రగ్స్ కేసులో 12 మందిపై పీడీ యాక్ట్ చేసినట్టు తెలిపారు. 282 డ్రగ్స్ కేసుల్లో 698 మందిని అరెస్టు చేశారని సీపీ వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలోనీ అన్ని నేరాల్లో 21.66 కోట్ల నష్టం జరిగితే.. అందులో 12.77 కోట్లు రికవరీ చేశారని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే 2 శాతం రికవరీ రేట్ పెరిగిందిని స్పష్టం చేశారు.

Advertisement

కమిషనరేట్ పరిధిలో 16,594 కేసులు నమోదైనట్లు వివరించారు. అందులో 2,900 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు అయ్యాయని తెలిపారు. ఈ ఏడాది 3321 రోడ్డు ప్రమాదాలు జరగయన్నారు. అందులో 633 మంది మృతి చెందగా.. 3,205 మందికి గాయాలు అయ్యాయని సీపీ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే 16 శాతం రోడ్డు ప్రమాద మరణాలు పెరిగాయన్నారు. యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ యూనిట్ ద్వారా ఈ ఏడాది 56 కేసుల్లో 153 మంది నిందితులను అరెస్ట్ చేశారాని, 71 మంది బాధితులకు విముక్తి కలిగించామన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన 8,758 ఫిర్యాదులో 4,643 పరిష్కరించారని సీపీ పేర్కొన్నారు.

ఈ ఏడాది నేరాల్లో 5,241 కేసుల్లో శిక్షలు ఖరారు అయ్యాయన్నారు. కన్విక్షన్ రేట్ 62 శాతం పెరిగిందని తెలిపారు. 20 కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు పడిందని తెలిపారు. ఈ ఏడాది సైబర్ నేరాలు 2,562 కేసులు నమోదయ్యయని చెప్పారు. ఈ ఏడాది 282 మాదకద్రవ్యాల కేసుల్లో 698 మందిని అరెస్టు చేశారని తెలిపారు. అందులో 12 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు వెల్లడించారు. మానవ అక్రమ రవాణా 58 కేసులో 163 మంది అరెస్టు చేసినట్లుగా, ఆరుగురిపై పీడీ యాక్ట్ పెట్టారని సీపీ తెలిపారు.

Advertisement

గేమింగ్ యాక్ట్ పై 188 కేసులు నమోదు చేయగా వాటిలో 972 మందిని అరెస్ట్ చేశారని చెప్పారు. రాచకొండ పరిధిలో గత ఏడాదితో పోలిస్తే 6.86% నేరాలు పెరిగయని సీపీ వెల్లడించారు.
రాచకొండ పరిధిలో సైబర్ నేరాలు 25శాతం పెరిగాయన్నారు. మహిళపై నేరాలు 6.65 శాతం తగ్గాయని సీపీ తెలిపారు.

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×