E-Paper
Advertisement

ఇంధనం పొదుపు బాటలో బీజేపీ పాలిత రాష్ట్రాలు.. ఏపీ దారిలో ఉత్తరాఖండ్, ఆ మూడు నిర్ణయాలు

ఇంధనం పొదుపు బాటలో బీజేపీ పాలిత రాష్ట్రాలు.. ఏపీ దారిలో ఉత్తరాఖండ్, ఆ మూడు నిర్ణయాలు
Advertisement

Uttarakhand:  ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు పొదుపు మంత్రంలో నిమగ్నమయ్యాయి వివిధ రాష్ట్రాలు. తాజాగా ఏపీ బాటలో ఉత్తరాఖండ్ నడుస్తోంది.  ఇంధనం పొదుపు చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కీలక నిర్ణయం తీసుకున్నారు. వారంలో ఒకరోజు వాహన రహిత దినం పాటించాలని డిసైడ్ అయ్యారు.

ఇంధనం పొదుపు బాటలో బీజేపీ పాలిత రాష్ట్రాలు

Advertisement

హైదరాబాద్ సభలో ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు బీజేపీ రాష్ట్రాలు వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఇంధనం పొదుపుపై దృష్టి సారించాయి. ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, యూపీ, చివరకు ఉత్తరాఖండ్ కూడా చేరిపోయింది. ఉత్తరాఖండ్ పుష్కర్ సింగ్ ధామి కేబినెట్ బుధవారం భేటీ అయ్యింది.

మంత్రి వర్గం భేటీలో ప్రధానంగా ఇంధనం పొదుపు దృష్టి సారించింది. స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలను ప్రకటించారు. అందులో వారానికి ఒకసారి వాహన రహిత దినం పాటించాలన్నది ఒకటి. వర్క్ ఫ్రమ్ హోం విధానాలను ప్రోత్సహించడం, సీఎం కాన్వాయ్‌లో వాహనాలను 50 శాతం తగ్గించడం వంటివి ఉన్నాయి.

Advertisement

ఏపీ దారిలో ఉత్తరాఖండ్.. ఆ మూడు నిర్ణయాలు

కరోనా, రష్యా-ఉక్రెయిన్ వార్, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో చమురు సరఫరా తీవ్ర ప్రభావం పడుతోంది. ముఖ్యంగా ఇంధనం, ఆహార పదార్థాలు, ఎరువులపై ఒత్తిడి తెచ్చాయని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలన్నారు.

ముఖ్యమంత్రితోపాటు మంత్రుల వాహనాల సంఖ్యను 50 శాతం తగ్గించుకోనున్నారు. ప్రతి వారం ఒక రోజును వాహన రహిత దినంగా పాటించనుంది. ప్రభుత్వ శాఖలన్నింటిలో వీడియో కాన్ఫరెన్సింగ్ సమావేశాలను ప్రోత్సహిస్తామని తెలిపింది.

ALSO READ: మద్యం నిబంధనలు కఠినతరం.. విజయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఐడీ కార్డు చూపిస్తేనే, ఆపై 21 ఏళ్లు

అటు ప్రైవేట్ రంగంలో వర్క్-ఫ్రమ్-హోమ్ విధానాలను అవలంబించేలా ప్రోత్సహిస్తామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం పేర్కొంది. అంతేకాదు ప్రభుత్వ- ప్రైవేట్ భవనాల్లో ఏసీల వాడకాన్ని పరిమితం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.

Related News

పిల్లలను రెచ్చగొట్టొద్దు..లీక్ ఘోర పాపం, నీట్‌పై నోరు విప్పిన ప్రధాని మోదీ

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

Big Stories

Advertisement
×