E-Paper
Advertisement

రాష్ట్ర ప్రభుత్వం సంచలనం.. రాబోయే 6 నెలలు.. కొత్త కార్లు, బైక్‌ కొనుగోళ్లపై నిషేధం!

రాష్ట్ర ప్రభుత్వం సంచలనం.. రాబోయే 6 నెలలు.. కొత్త కార్లు, బైక్‌ కొనుగోళ్లపై నిషేధం!
Advertisement

Vehicle Ban: దిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాబోయే 6 నెలల పాటు కొత్త కార్ల కొనుగోళ్లపై నిషేధం విధించింది. అలాగే పెట్రోల్ తో నడిచే బైక్ లపైనా ఈ ఆంక్షలు కొనసాగుతాయని దిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రకటించారు. అయితే ఇది కేవలం ప్రభుత్వానికి మాత్రమే వర్తిస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఈ నిషేధంతో సామాన్యులకు సంబంధం లేదని అన్నారు.

ప్రభుత్వానికి సంబంధించిన రోజూవారి అవసరాల కోసం ప్రతీ రాష్ట్రం ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను కొనుగోలు చేస్తూ ఉంటుంది. అలాగే బైక్స్ ను సైతం కొని.. సంబంధిత అధికారులకు ఇస్తూ ఉంటుంది. కాగా దిల్లీ ప్రభుత్వం ఈ విధానంపై తాత్కాలికంగా నిషేధం విధించింది. దీని ప్రకారం వచ్చే 6 నెలల పాటు పెట్రోల్, డీజిల్ లేదా సీఎన్ జీతో నడిచే వాహనాలను దిల్లీ ప్రభుత్వం కొనుగోలు చేయదు.

Advertisement

అయితే వాహనాలకు సంబంధించి దిల్లీ ప్రభుత్వం ఇప్పటికే కఠిన నిబంధలను అమలు చేస్తోంది. 10 ఏళ్ల క్రితం నాటి డీజిల్ కార్లు, 15 ఏళ్ల కాలం నాటి పెట్రోల్ కార్లు రోడ్లపైకి రాకుండా నిషేధం విధించింది. అతి తక్కువ సమయంలో వాహనాలకు సంబంధించి ఇన్ని కఠినమైన ఆంక్షలను దిల్లీ ప్రభుత్వం తీసుకొస్తుండటం.. దిల్లీ పౌరులతో పాటు కార్ల తయారీ సంస్థలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

అయితే గురువారమే దిల్లీ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. వారంలో 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని కంపెనీలను ఆదేశించింది. ప్రజలు వ్యక్తిగత వాహనాల్లో కాకుండా.. ప్రయాణానికి ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకోవాలని దిల్లీ సీఎెం రేఖా గుప్తా పిలుపునిచ్చారు. కాగా, హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ సైతం వర్క్ ఫ్రమ్ హోమ్ ను కంపెనీలు ప్రోత్సహించాలని సూచించారు. చమురును పొదుపుగా ఉపయోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Also Read: కొత్త ఏసీ లేదా కూలర్ మెురాయిస్తోందా? రూపాయి ఖర్చు లేకుండా.. మరో ఏసీ, రూ.1 లక్ష పొందే ఛాన్స్!

అయితే దిల్లీ ప్రభుత్వం 6 నెలలపాటు కార్లు, బైక్స్ పై నిషేధం విధించడానికి చమురు కొరతతో పాటు మరో ప్రధానమైన కారణం కూడా ఉంది. దిల్లీలో నానాటికి పెరిగిపోతున్న వాయు కాలుష్యానికి వాహనాల ఉద్గారాలే ప్రధాన కారణమని ప్రభుత్వం గుర్తించింది. గణాంకాల ప్రకారం.. దిల్లీలోని మొత్తం వాహనాల్లో 80-90 శాతం పెట్రోల్, డీజిల్ వాహనాలే ఉన్నాయి. వీటిని ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడం ద్వారా కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ క్రమంలోనే మార్పు తన నుంచే మెుదలవ్వాలన్న ఉద్దేశంతో పాటు.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కార్లు, బైక్స్ కొనుగోళ్లపై దిల్లీ సర్కార్ నిషేధం విధించినట్లు తెలుస్తోంది.

Also Read: BSNL కొత్త ప్లాన్ చూశారా? రూ.225 చెల్లిస్తే చాలు.. నెలంతా ఇక జాతరే!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×