E-Paper
Advertisement

Vande Bharat train : వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ లో మంటలు.. ప్రయాణికులు సేఫ్..

Vande Bharat train : వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ లో మంటలు.. ప్రయాణికులు సేఫ్..
Advertisement

Vande Bharat train : వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురైంది. భోపాల్‌ నుంచి ఢిల్లీ వెళ్తుండగా రైలులో మంటలు చెలరేగాయి. సీ-14 కోచ్‌ వద్ద మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ప్రయాణికులు కోచ్ నుంచి బయటకు పరుగు తీశారు.

సోమవారం ఉదయం వందే భారత్‌ ఎక్స్ ప్రెస్ భోపాల్‌ నుంచి ఢిల్లీ బయలుదేరింది. రాణికమలాపాటి స్టేషన్‌ నుంచి ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత కుర్వాయి స్టేషన్‌ వద్ద రైలులోని బ్యాటరీ నుంచి మంటలు వచ్చాయి. వెంటనే రైల్వే సిబ్బంది మంటలను గుర్తించారు. లోకో పైలట్‌కు సమాచారం ఇచ్చి ప్రమాదంపై అప్రమత్తం చేశారు. దీంతో లోకో పైలట్ రైలును అక్కడే నిలిపివేశారు.

Advertisement

అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ లోని సీ-14 కోచ్ లో చెలరేగిన మంటలను అదుపు చేశారు. రైలులో ‍మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×