Chennai: ఏపీ రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయా? తాజాగా మాజీ సీఎం జగన్ సోదరుడు వైఎస్ అనిల్రెడ్డి.. సీఎం విజయ్తో భేటీ వెనుక ఏం జరిగింది? వచ్చేవారం ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాతో సీఎం విజయ్ సమావేశం కానున్నారా? ఈలోగా వైఎస్ అనిల్రెడ్డి కలవడం వెనుక అసలు రహస్యం ఏంటి? ఇవే ప్రశ్నలు ఇప్పుడు రైజ్ అవుతున్నాయి.
సీఎం విజయ్తో వైఎస్ అనిల్రెడ్డి సమావేశం
వచ్చేవారం ఢిల్లీకి వెళ్లనున్నారు తమిళనాడు సీఎం విజయ్. కేంద్రం పెద్దలతో ఆయన వివిధ అంశాలపై సమావేశమై చర్చించనున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా ప్రధానంగా భేటీ కానున్నారు సీఎం విజయ్. ఈ సందర్భంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రాబోయే నిధుల నుంచి చర్చించనున్నట్లు టీవీకే వర్గాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో జగన్ సోదరుడు వైఎస్ అనిల్రెడ్డి రెండురోజుల కిందట సీఎం విజయ్తో భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం తెలియగానే కూటమి నేతల్లో చర్చ మొదలైంది. వీరిద్దరు సమావేశం వెనుక అజెండా ఏంటి? జగన్.. సీఎం విజయ్ ద్వారా బీజేపీ పెద్దలతో రాయబారం నడుపుతున్నారా? అవుననే అంటున్నారు కొందరు నేతలు.
వచ్చేవారం కేంద్రం పెద్దలతో సీఎం విజయ్ సమావేశం
ఇంతకూ వైఎస్ అనిల్రెడ్డి ఎవరు? ఆయనకు జగన్కు ఉన్న సంబంధం ఏంటి? లిక్కర్ కేసులో వైఎస్ అనిల్రెడ్డి పేరు వెలుగులోకి ఎలా వచ్చింది? పులివెందులలో జన్మించి వైఎస్ అనిల్రెడ్డి. చెన్నైలో నివాసం ఉంటున్నారు. ఏపీ మాజీ సీఎం జగన్కు కజిన్ బ్రదర్. ఆయన పెద్దనాన్న జార్జిరెడ్డి కొడుకు అనిల్రెడ్డి. ఆఫ్రికాలో మద్యం వ్యాపారం చేసినట్టు అనిల్రెడ్డిపై రకరకాల వార్తలు లేకపోలేదు.
జగన్కు సోదరుడే కాదు నమ్మకమైన ఆప్తుడు కూడా అనిల్రెడ్డి. జగన్ ప్రభుత్వంలో ఇసుక, లిక్కర్ స్కామ్ల్లో ఆయనపై ఆరోపణలున్నాయి. లిక్కర్ స్కామ్లో అనిల్ రెడ్డి ప్రమేయంపై సిట్ విచారణ చేస్తోంది. గతేడాది సెప్టెంబర్లో సిట్ సోదాలు చేసింది. వైఎస్ అనిల్రెడ్డి.. ఇళ్లు, కంపెనీల్లో సోదాలు చేసింది. ఆయనకు చెందిన చెన్నై, హైదరాబాద్ కంపెనీల్లో డాక్యుమెంట్లు, డిజిటల్ ఆధారాలు స్వాధీనం చేసుకున్న విషయం తెల్సిందే.
ALSO READ: CBSE సంచలనం.. 9, 10 తరగతులకు 3 భాషలు తప్పనిసరి.. రూల్స్ మారాయ్!
తమిళనాడులో ఎన్నికల ఫలితాలు విడుదల కాగానే వైసీపీ నేతలు.. విజయ్ మావాడే అంటూ మీడియా ముందు నానా రచ్చ చేశారు. ఎన్నికల సమయంలో జగన్ ఎలాగైతే వ్యూహాలు రచించాడో దాని బాటలో టీవీకే అధినేత విజయ్ అడుగులు వేశారంటూ మీడియా ముందు పదే పదే చెప్పారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. బీజేపీ పెద్దలతో జగన్ దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు కూటమి నేతలు.
This person YS Anil Reddy who met our CM Thiru. @TVKVijayHQ is the brother of former Andhra Pradesh Chief Minister YS Jagan and one of the main accused in Andhra’s ₹4,000 crore liquor scam.
As per the ED probe, the accused allegedly collected bribes worth ₹50–60 crore every… pic.twitter.com/GrCkjHDV7Z
— Selva Kumar (@Selvakumar_IN) May 16, 2026