E-Paper
Advertisement

Disaster Drama OTT : భోపాల్‌ విషాదాన్ని కళ్ళకు కట్టిన సిరీస్… ఈ రైల్వే హీరో సాహసం అస్సలు మిస్ అవ్వొద్దు

Disaster Drama OTT : భోపాల్‌ విషాదాన్ని కళ్ళకు కట్టిన సిరీస్… ఈ రైల్వే హీరో సాహసం అస్సలు మిస్ అవ్వొద్దు
Advertisement

Disaster Drama OTT : ఇటీవల కాలంలో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలు, సిరీస్ ను ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. అలాంటి సిరీస్ తో కాలక్షేపం చేయాలి అనుకుంటున్న వారి కోసమే ఈ మూవీ సజెషన్. మరి ఈ సిరీస్ ఏంటి ? ఏ రియల్ స్టోరీ ఆధారంగా దీన్ని తెరకెక్కించారు ? ఎక్కడ చూడవచ్చు ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సిరీస్ పేరు ‘ది రైల్వేమెన్‌’ (The Railway Men). ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటనను ఈ సిరీస్ తో కళ్ల ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేసింది. 1984 భోపాల్ గ్యాస్ ట్రాజెడీని గ్రిప్పింగ్ మినీ సిరీస్గా రిలీజ్ చేశారు. శివ్ రావైల్ దర్శకత్వం వహించిన ఈ 4 ఎపిసోడ్స్ సిరీస్ ను 2023 నవంబర్ 18న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేశారు. భోపాల్ లో గ్యాస్ లీకైన రోజు రాత్రి రైల్వే ఉద్యోగులు చూపిన ధైర్యం, మానవత్వాన్ని ఇందులో అద్భుతంగా చూపించారు. IMDbలో 8.5 రేటింగ్ ఉన్న ఈ సిరీస్ ఇండియన్ ఓటీటీలలో ఉన్న బెస్ట్ సిరీస్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ సిరీస్ లో రతన్ చంద్ర జోషి అనే రైల్వే జనరల్ మేనేజర్ పాత్రలో కన్పించారు ఆర్. మాధవన్. ఇఫ్తికార్ సిద్దికీ అనే స్టేషన్ మాస్టర్ గా కేకే మేనన్ నటించారు. దివ్యేందు, బాబిల్ ఖాన్, సన్నీ హిందూజా, జూహి చావ్లా తదితరులు సపోర్టింగ్ రోల్స్ చేశారు.

Advertisement

Read Also :  ఉరుగ్వే ఫ్లైట్ 571 విషాదగాథ… ఒక్కో సీనుకూ వణికిపోవాల్సిందే మావా

స్టోరీలోకి వెళ్తే…

భోపాల్ రైల్వే స్టేషన్‌లో స్టేషన్ మాస్టర్‌ గా పని చేస్తూ ఉంటాడు ఇఫ్తికార్‌ సిద్ధిఖీ. అక్కడ పని చేసే ప్రతి ఒక్కరూ ఆయనకు బాగా గౌరవం ఇస్తారు. అలాగే ఆయన మంచి మనసున్న మనిషి. ఎవరు నోరు తెరిచి అవసరం ఉందన్నా లేదా ఆపద అని తెలిసినా ఆదుకోవడంలో ముందు ఉంటాడు. ఇదిలా ఉండగా ఓ విదేశీ సంస్థ భోపాల్‌ నడిబొడ్డున యూనియన్‌ కార్బైడ్‌ ఫ్యాక్టరీని నడుపుతుంది. ఆ చుట్టు పక్కల ఎంతోమంది జనాలు నివాసిస్తున్నా కూడా… కనీస భద్రతా ప్రమాణాలు కూడా పాటించరు. సీనియర్‌ వర్కర్లు ఫ్యాక్టరీకి సంబంధించిన లోపాలను ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తాడు. కానీ వాళ్ళు నష్టాల గురించి మాట్లాడి వీళ్ళ నోరు మూయిస్తారు.

Advertisement

అక్కడే పని చేసే ఇమద్ ఆ పక్కనున్న బస్తీలోనే నివశిస్తాడు. కానీ తన ఫ్రెండ్ చనిపోవడంతో అక్కడ పని మానేసి, రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీలో వర్కర్‌ గా జాయిన్ అవుతాడు. ఇక ఇతని ద్వారానే రిపోర్టర్ ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన లోపాల విషయాలను తెలుసుకుంటాడు. ఈ నేపథ్యంలోనే ఓ రోజు రాత్రి యూనియన్‌ కార్బైడ్‌ ఫ్యాక్టరీ నుంచి సడన్ గా గ్యాస్‌ లీక్‌ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నెమ్మదిగా ఆ ప్రాణాంతక గ్యాస్ భోపాల్‌ మొత్తం వ్యాపిస్తుంది. మరి ఆ టైమ్ లో నిద్రపోతున్న జనాల్లో ఎంతమంది బతికి బయట పడ్డారు ? ఇందులో స్టేషన్ మాస్టర్ రోల్ ఏంటి ? ఆ విషవాయువు ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంది ? అనేది తెరపై చూడాల్సిందే.

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×