E-Paper
Advertisement

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!
Advertisement

Mega DSC: చంద్రబాబు మెగా డీఎస్సీ స్కాంలో అర్హత లేనివారికి ఉద్యోగాలు కట్టబెట్టారంటూ సాక్ష్యాలు బయటకు వస్తున్నా, ఈ వ్యవహారాన్ని సీబీఐ విచారణకు ఇవ్వకుండా ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారని మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు. ఇంకెన్నాళ్లు యువకులను మోసం చేస్తారు?మీరు నిర్వహించిన డీఎస్సీ మోసాల్లో “మెగా నిజాయితీపరులైన అభ్యర్థుల పాలిట “దగా” అని తేలిపోతుంటే మీరు, మీ సుపుత్రుడు దాక్కోవడం ఎందుకు అంటూ ఫైర్ అయ్యారు. ఈ స్కాంకు బాధ్యత వహిస్తూ, విద్యాశాఖ మంత్రి లోకేష్‌ చేత రాజీనామా చేయించకుండా అధికార బలంతో అబద్ధాలుచెప్తూ పబ్లిసిటీ గిమ్మిక్కులు చేస్తూ కొడుకును కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అని అన్నారు.

పోస్టు ఎలా ఇచ్చారు..

కర్నూలు జిల్లాలో ఒక అభ్యర్థికి తన కేటగిరీ ప్రకారం టెట్‌లో 75 మార్కులు రావాల్సి ఉండగా 65 మార్కులే వచ్చినా స్పోర్ట్స్‌ కోటాలో ఎస్‌జీటీ పోస్టు ఎలా ఇచ్చారని అన్నారు. ఒన్‌-టు-ఒన్‌ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ చేసి మరీ, అర్హత లేదని తెలిసి కూడా పోస్టు ఎలా ఇచ్చారు దరఖాస్తు దశలోనే రిజెక్ట్‌ కావాల్సిన వ్యక్తి ఆ తర్వాత దశలుకూడా దాటి ఉద్యోగం ఎలా పొందగలిగాడని జగన్ ప్రశ్నించారు. అధికారుల చేత ఈ పని చేయించిన ఆ అదృశ్య శక్తి ఎవరు? లోకేష్‌ కాదంటారా? రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో డీఎస్సీ–2025లో ఇలాంటి అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు ఎన్నో ఉన్నాయని అన్నారు. చంద్రబాబు ఇలాంటి పరిస్థితుల్లో మీ ప్రభుత్వమే అధికారంలో ఉండగా మీ అధికారులతో చేసే విచారణలు నిజాయితీగా, స్వతంత్రంగా జరుగుతాయా అని ప్రశ్నించారు.

డీఎస్సీ నుంచి ఏపీపీఎస్సీకి..

Advertisement

మీ కుమారుడు రాజీనామా చేయాల్సిన పరిస్థితుల్లో మీ కింద పనిచేసే అధికారులు స్వతంత్రంగా నడుచుకోగలర అని అన్నారు. అందుకే డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌పై సీబీఐ విచారణ చేయించాలని మేం మొదటి నుంచీ పట్టుబడుతున్నాంమన్నారు. నిజాయితీపరులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా కోర్టులోనూ పోరాడుతున్నామని, చంద్రబాబు మరో నిర్ఘాంతపరిచే విషయం ఏంటంటే పరీక్షలు లేకుండానే టీచర్‌ పోస్టులు కట్టబెట్టిన మీరు మీ అక్రమాల విధానాన్ని డీఎస్సీ నుంచి ఏపీపీఎస్సీకి కూడా పాకించడం దారునం అని అన్నారు. మా హయాంలో ఫైనాన్స్‌ క్లియరెన్స్‌ పొందిన అటవీశాఖలోని 814 ఉద్యోగాలకు, నోటిఫికేషన్లు జారీ చేసి, మెయిన్స్‌ పరీక్షలు పూర్తి చేసిన తర్వాత
అందులో 40 స్పోర్ట్స్‌ కోటా పోస్టులను పరీక్ష లేకుండా కేవలం సర్టిఫికెట్ల ఆధారంగా భర్తీ చేసేందుకు డీఎస్సీలో ఉపయోగించిన జీవో నంబర్‌-4నే మీరు వాడుకున్న మాట వాస్తవం కాదా అని జగన్ ప్రశ్నించారు.

Also read: కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

774 పోస్టుల భర్తీ..

Advertisement

డీఎస్సీ అక్రమాలు బయటపడగానే ఇవి కూడా వెలుగులోకి వస్తాయనే భయంతో రిక్రూట్‌మెంట్‌ను మధ్యలో ఆపేయడంతోపాటు ఈ 40 పోస్టుల జాబితా బయటపడితే బాగోతం బయటపడుతుందనే ఉద్దేశంతో మిగిలిన 774 పోస్టుల భర్తీని కూడా నిలిపేయడం వాస్తవం కాదంటారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇన్ని అక్రమాలు జరిగాయి కాబట్టే వీటి వెనుక మీరు, మీ సుపుత్రుడు ఉన్నారు కాబట్టే మీరు సీబీఐ విచారణకు అంగీకరించడం లేదని తేల్చి చెప్పారు. ఉద్యోగాలు పొందిన వారితో ర్యాలీలు చేయించి, మీకు డబ్బా కొట్టించుకోవడం వల్ల నిజాయితీపరులైన ఉద్యోగార్థులను దెబ్బతీసిన ఈ దారుణమైన స్కాంను కప్పిపుచ్చలేరని ఫైర్ అయ్యారు.

జగన్ భరోసా..

పారదర్శకంగా పరీక్షలు, నిష్పక్షపాతంగా ఉద్యోగ నియామకాల కోసం పోరాడుతున్న ఉద్యోగార్థులు, యువకులకు వైయస్సార్‌సీపీ ఎప్పుడూ అండగా నిలుస్తామని మరోమారు జగన్ భరోసా ఇస్తూ.. లీకేజీ వ్యవహారం నుంచి స్పోర్ట్స్‌ కోటా వరకు టెట్‌ అర్హతల నుంచి పోస్టింగ్‌ ఆర్డర్ల వరకు మొత్తంగా మెగా డీఎస్సీ వ్యవహారాన్ని, జీవో నంబర్‌ 4 ఆధారంగా నడిచిన నియామకాలన్నింటినీ సీబీఐకి అప్పగించాలని మరోమారు డిమాండ్‌ చేస్తున్నామని జగన్ అన్నారు.

Also read: సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

Tags

Related News

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×