Swayambhu OTT: నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన నిఖిల్ మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎన్నో విభిన్నమైన సినిమాల ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇదివరకే నిఖిల్ నటించిన కార్తికేయ 2 పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే విడుదలకు సిద్ధమవుతున్నాయి.
నిఖిల్ నటించిన స్వయంభు(Swayambhu) సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా పట్ల భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. నిజానికి ఈ సినిమా ఫిబ్రవరి 13వ తేదీ మహాశివరాత్రిని పురస్కరించుకొని విడుదల కావాల్సి ఉండగా విఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం కావడంతో సినిమా విడుదల వాయిదా పడింది. మంచి క్వాలిటీ సినిమాని ప్రేక్షకులకు అందించాలన్న ఉద్దేశంతోనే ఈ సినిమాని వాయిదా వేసామని చిత్ర బృందం తెలియచేశారు.
ఇప్పటివరకు ఈ సినిమా తదుపరి విడుదల తేదీని ప్రకటించకపోయినప్పటికీ సినిమా పట్ల మంచి అంచనాలు పెరగడంతో ఈ సినిమాకు ఓటీటీ నుంచి అద్భుతమైన డీల్ వచ్చిందని తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్(Net Flix) దక్కించుకుంది. అయితే ఈ సినిమా విషయంలో నెట్ ఫ్లిక్స్ క్రేజీ ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది. సాధారణంగా ఒక సినిమా విడుదలకు ముందే సినిమాకు ఇన్ని కోట్లు అంటూ డీల్ కుదుర్చుకుంటారు. కానీ నెట్ఫ్లిక్స్ సరికొత్త విధానాన్ని అమలులోకి తీసుకువస్తుంది. పర్ఫామెన్స్ బేస్డ్ డీల్ ద్వారా సినిమాలను కైవసం చేసుకుంటున్నారు.
ఎన్ని కలెక్షన్లు వస్తే అంత లాభం..
ఇదివరకు విడుదలకు ముందు సినిమాకు 50 కోట్లు డీల్ కుదుర్చుకుంటే ఆ సినిమా లాభనష్టాలతో సంబంధం లేకుండా ఓటీటీ సమస్త చెల్లించాల్సి ఉంది. కానీ ఇప్పుడు సినిమా విడుదలైన తర్వాత థియేటర్లలో ఆ సినిమా ఎంత మొత్తంలో కలెక్షన్లను రాబడుతుందనే విషయంపైనే ఆధారపడి ఉంది. ఉదాహరణకు ఒక సినిమా 200 కోట్ల నెట్ కలెక్షన్లను రాబడితే అందులో సగం అంటే వంద కోట్ల రూపాయలను డిజిటల్ రైట్స్ కింద చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారట. ఈ లెక్కన థియేటర్లలో స్వయంభు సినిమా ఎంత కలెక్షన్లను రాబడితే ఓటీటీ నుంచి అంత మొత్తంలో లాభాలు వస్తాయని చెప్పాలి. ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున డబ్బు చెల్లించి సినిమాలు కొనుగోలు చేసినప్పటికీ డిజిటల్ మీడియాలో అనుకున్న స్థాయిలో వ్యూస్ రాకపోవడంతోనే ఇలా సరికొత్త విధానాన్ని అమలులోకి తీసుకు వస్తున్నారని తెలుస్తుంది. ఈ కొత్త విధానం ద్వారా ఎవరికి ఏ విధమైనటువంటి నష్టాలు కూడా ఉండవని చెప్పాలి.
Also Read: స్టార్ హీరో ఇంటి కోడలు కాబోతున్న కళ్యాణి ప్రియదర్శన్… సైలెంట్ గానే పెళ్లిపీటలు ఎక్కబోతోందా?