OTT Movie : క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూస్తున్నంత సేపూ కంటిరెప్ప వాల్చనంత ఎంగేజింగ్ గా చేస్తాయి. సాధరణంగా ఇలాంటి సినిమాలలో కిల్లర్ క్రైమ్ చేయడం, పోలీసులు అతన్ని వెతికి పట్టుకోవడానికి పరుగులు పెట్టడం అనే ప్లాట్ చూస్తూ ఉంటాము. కానీ ఈ సినిమాలో మాత్రం సైకో ఏకాంగ్ పోలీసులనే టార్గెట్ చేసి చంపుతూ ఉంటాడు. ఊరవతల శవాన్ని పారేసి ‘దమ్ముంటే పట్టుకోరా షెకావత్’ అని సవాల్ విసురుతాడు. మరి ఇంత ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో రూపొందిన ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది? అనే వివరాల్లోకి వెళ్తే…
కుంచాకో బోబన్, శ్రీనాథ్ భాసి, షరాఫ్ యుద్దీన్, ఉన్నిమయ ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ ‘అంజామ్ పతిరా’ (anjaam pathiraa). మిధున్ మాన్యువల్ థామస్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ తెలుగులో ‘మిడ్ నైట్ మర్డర్స్’ (midnight murders) పేరుతో విడుదలైంది. 2020 లో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రస్తుతం తెలుగులో ఆహా (Aha)లో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో కూడా అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం… ఇంకా ఈ మూవీని చూడకపోతే వెంటనే ఓ లుక్కేయండి.
Read Also : పెళ్లి వద్దు ప్రేమే ముద్దనే అమ్మాయి… రాత్రీపగలు అలాంటి పనులే… క్లైమాక్స్ వరకు ఆ సీన్లే
ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ అన్వర్ హుస్సేన్ (కుంచకో బోబన్). అతను సిటీ పోలీస్శాఖలో అన్ అఫిషియల్ గా క్రిమినాలజిస్ట్గా పని చేస్తాడు. అంటే పోలీసులకు తెగని కేసుల్లో దగ్గరుండి హెల్ప్ చేస్తాడన్న మాట. పోలీసులకు కూడా అంతుచిక్కని క్లూలు దొరకబట్టి కేసు విచారణ సజావుగా సాగేలా చేస్తాడు. ఈ క్రమంలోనే అనూహ్యంగా ఓరోజు విశాఖ పోలీస్ డిపార్ట్మెంట్ లో డీఎస్పీగా పని చేస్తున్న అభిమన్యు కౌశిక్ అత్యంత దారుణంగా హత్యకు గురవుతాడు. ఆయన కళ్లు, గుండెను కోసేసి, శవాన్ని ఊరవతల పడేస్తారు. ఈ కేసు విచారణ జరుగుతుండగానే మరో పోలీస్ ఆఫీసర్ కూడా అచ్చం ఇలాగే మర్డర్ కు గురవుతాడు. దీంతో రెడ్ అలర్ట్ ప్రకటించిన పోలీసులు కిల్లర్ కోసం ముమ్మరంగా గాలిస్తారు.
అలా సాగుతున్న ఇన్వెస్టిగేషన్ లో పోలీసుల మృతదేహం పక్కన కళ్లకు గంతలు లేకుండా ఉన్న న్యాయదేవత ప్రతిమ కనిపించి, కేసును ఊహించని మలుపు తిప్పుతుంది. అంతుచిక్కని ఈ మిస్టరీని చేధించడానికి పోలీసులు డాక్టర్ అన్వర్ హుస్సేన్ సహాయం తీసుకుంటారు. మరి అన్వర్ ఈ కేసు వెనకాల ఉన్న కిల్లర్ ను పట్టుకోగలిగాడా? ఇంతకీ హంతకుడు ఎవరు? పోలీసులనే ఎందుకు చంపుతున్నాడు? అనేది తెలియాలంటే ఈ మూవీని ఓటీటీలో చూడాల్సిందే.