Thriller Movie OTT : ఓటీటీలోకి రకరకాల భాషలలో సినిమాలు వస్తున్నాయి. అయితే కంటెంట్ బాగుంటే ఆడియన్స్ భాషను కూడా పట్టించుకోరు. అలాగే వాచ్ చేస్తారు. అలాంటి కంటెంట్ ఉన్న ఒక సినిమా గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఇది ఒక మరాఠీ సినిమా. అడవిలోని గిరిజనుల సమస్యలపై డాక్యుమెంటరీ తీస్తూ మిస్సింగ్ అయిన వ్యక్తి కోసం, అతని భార్య, కూతురు వెతికే ప్రయత్నమే ఈ సినిమా కథ. ఇది వురాణాలలోని ఒక రాక్షసుడి కథ ఆధారంగా ఉంటుంది. ఫాంటసీ, మిస్టరీ, అడ్వెంచర్ మిక్స్తో ఉన్న ఎమోషనల్ డ్రామా ఈ మరాఠీ సినిమా. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
ఈ మరాఠీ ఫాంటసీ థ్రిల్లర్ సినిమా పేరు ‘రాక్షస్’ (Raakshas). ఈ చిత్రానికి జ్ఞానేష్ జోటింగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2018 ఫిబ్రవరి 23న థియేటర్లలో విడుదలైంది. ప్రధాన పాత్రల్లో సాయి తమ్హంకర్ మరియు శరద్ కేల్కర్ నటించారు. వీరితో పాటు రుజుతా దేశ్పాండే కీలక పాత్ర పోషించింది. IMDb 7.1/10 రేటింగ్ ని కూడా పొందింది. ప్రస్తుతం Zee5 ఓటీటీలో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఇది ఫ్యామిలీతో చూడడానికి బాగా ఉంటుంది.
అవినాష్ ఒక డాక్యుమెంటరీ డైరెక్టర్. అడవిలో గిరిజనులకు జరుగుతున్న అన్యాయాల గురించి షూట్ చేస్తూ సడన్గా మిస్ అయిపోతాడు. అతడి కోసం భార్య ఐరావతి, కూతురు అరు అడవికి వెళ్తారు. ఐరావతి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వెతుకుతుంటే, చిన్నారి అరు మాత్రం తన దగ్గర ఉన్న ఒక కథల పుస్తకం ఆధారంగా తండ్రిని వెతకడం మొదలుపెడుతుంది. ఆ పుస్తకంలో ఉన్న ఒక రాక్షసుడి కథ నిజంగానే తన తండ్రికి జరిగిందని ఆ పాప నమ్ముతుంది.
అడవిలో ఉండే గిరిజన తెగల నమ్మకాలు, ఆ మాయా కథల పుస్తకం చుట్టూ సినిమా అంతా చాలా ఇంట్రెస్టింగ్గా తిరుగుతుంది. అసలు ఆ అడవిలో ఉన్న రాక్షసుడు ఎవరు? అవినాష్ ఏమయ్యాడు? ఆ మాయా పుస్తకం కథ ఏమిటి ? అనే విషయాలను దర్శకుడు చాలా థ్రిల్లింగ్గా చూపించారు. రియాలిటీకి, ఫాంటసీకి మధ్య ఉండే ఈ గ్యాప్ని బ్యాలెన్స్ చేస్తూ సాగే ఈ సినిమా, చివరికి ఒక మంచి మెసేజ్తో ముగుస్తుంది.
Read Also : జోంబీగా మారే అందమైన అమ్మాయి… ప్రేమ అంటూ వెంటపడే అబ్బాయి… గుండెకు హత్తుకునే లవ్ స్టోరీ