AI+ Pluse: కొత్త ఏడాది ప్రారంభంలోనే ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ తన తొలి బిగ్ సేవింగ్స్ సేల్ను ప్రారంభించింది.ఈ సేల్ ద్వారా అనేక ప్రొడక్ట్స్ మీద భారీ తగ్గింపులను పొందవచ్చు. తక్కువ ధరలో స్మార్ట్ఫోన్ కొనాలని చూస్తున్న వాళ్లు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ఈ సేల్లో స్మార్ట్ఫోన్ల ధరలు కూడా రూ.5,999 నుండి ప్రారంభం అవుతోంది. ఇప్పుడీ స్వదేశీ బ్రాండ్ AI+ పల్స్ స్మార్ట్ఫోన్ డిస్కౌంట్ వివరాలు, స్పెసిఫికేషన్లు గురించి తెలుసుకుందాం.
AI+ పల్స్ మొబైల్ అసలు ధర రూ.7,999. అయితే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ సేల్ ద్వారా దీని మీద రూ.2వేలు ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో మీరిప్పుడు ఈ ఫోన్ను రూ.5,999కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు క్యాష్బ్యాక్, ఎక్స్ఛేంజ్ వంటి అదనపు ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే మీ పాత ఫోన్ను మార్పిడి చేసుకోవడం ద్వారా అదనంగా రూ.4,350 ఆదా చేసుకోవచ్చు.
Also Read: రూ.21,999 ధరకే IP69 రేటింగ్ స్మార్ట్ఫోన్.. ఇండియన్ మార్కెట్లోకి ఒప్పో A6 ప్రో 5G వచ్చేసింది!
ఇండియన్ బ్రాండ్ అయిన AI+ పల్స్ ఫోన్ 4GB RAM+64GB, 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. దీనిలో 6.7-అంగుళాల HD+ డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్ను కలిగి ఉంటుంది. అలాగే 400 nits వరకు గరిష్ట బ్రైట్నెస్కు మద్దతు ఇస్తుంది. దీనికి LCD డిస్ప్లే ప్యానెల్ను ఉపయోగించారు. ఇది డిస్ప్లే 2D గ్లాస్ ద్వారా ప్రొటెక్ట్ పొందుతుంది. Uniscoc T615 ప్రాసెసర్ ద్వారా పని చేసే ఫోన్ 6GB RAM, 128GB స్టోరేజీతో అందుబాటులో ఉంది.
ఇకపోతే ఈ హ్యాండ్ సెట్ Android 15పై, nxtQ ఆపరేటింగ్ సిస్టమ్పై రన్ అవుతుంది. ఇంత తక్కువ ధరకు వస్తన్న ఈ ఫోన్ 4G/3G/2G కనెక్టివిటీని అందిస్తుంది.5000mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉన్న ఈ ఫోన 10W USB టైప్-C ఛార్జింగ్కు మద్దతు అందిస్తుంది. కంపెనీ ఈ ఫోన్లో 3.5mm ఆడియో జాక్ను, వెనుక 50MP AI కెమెరా, సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 5MP ఫ్రంట్ కెమెరాను అమర్చింది.
Also Read: సీసీ కెమెరాలు, వేరబుల్స్కు గుడ్బై.. Wi-Fi సెన్సింగ్తో ఎవరినైనా సైలెంట్గా ట్రాక్ చేసేయండి ఇలా!