E-Paper
Advertisement

APSRTC Good News: సంక్రాంతి ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 8,432 ప్రత్యేక బస్సులు, సాధారణ ఛార్జీలే!

APSRTC Good News: సంక్రాంతి ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 8,432 ప్రత్యేక బస్సులు, సాధారణ ఛార్జీలే!

APSRTC Good News: సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికుల రద్దీని ద‌ృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ భారీ ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది సంక్రాంతి ప్రయాణాల కోసం ఏకంగా 8వేల 432 ప్రత్యేక బస్సులను నడపాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ సర్వీసులకు అదనంగా వీటిని అందుబాటులోని తీసుకురావడం ద్యారా ప్రజలు క్షేమంగా తమ స్వగ్రామాలకు చేరుకునేలా  ప్రణాళికలు సిద్ధం చేసింది.

పండుగ పూట ఇతర రాష్ట్రాల నుండి ఆంధ్రప్రదేశ్ వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.  దీనిని గమనించిన ఏపీఎస్ ఆర్టీసీ సంస్థ..  హైదరాబాద్, బెంగళూరు, చైన్నై వంటి ప్రధాన నగరాల నుండి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలకు 2వేల 432 ప్రత్యేక బస్సులను కేటాయించారు. ముఖ్యంగా హైదరాబాద్ నుండి విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి వంటి ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉండడం వలన అత్యధికంగా బస్సు  సర్వీసులను నడుపుతున్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల కోసం మిగిలిన 6వేల వరకు బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు.

గతంలో పండుగ సమయంలో ప్రత్యేక బస్సుల్లో 50 శాతం వరకు  అదనపు ఛార్జీలు వసూలు చేసేవారు. కానీ.. ఈ సారి ప్రయాణికలకు ఊరటనిస్తూ.. సాధారణ ఛార్జీలతోనే ప్రత్యేక బస్సులను నడపాలని ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం అమలులో ఉన్న స్త్రీ శక్తి పథకం (ఫ్రీ బస్సు)  కారణంగా ఈ ఏడాది రద్దీ పెరిగే అవకాశం ఉందని భావిస్తూ.. సంస్థ మెుత్తం బస్సుల్లో సుమారు 71శాతం బస్సులను ప్రత్యేక సర్వీసులుగా నడపాలని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈ అదనపు సర్వీసుల వల్ల మహిళా ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా..  సీట్ల లభ్యత ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మెుత్తానికి ఏపీఎస్ ఆర్టీసీ మంచి నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. దీనివల్ల లక్షలాది మంది ప్రయాణికులు సురక్షితంగా.. తక్కువ ఖర్చుతో పండుగకు వెళ్లే అవకాశం ఉంది.

Related News

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

మీరు వెళ్లాల్సిన రైలు లేటయ్యిందా? డోంట్ వర్రీ.. హ్యాపీగా రైల్వే స్టేషన్ లో ఏసీ రూమ్ బుక్ చేసుకోండి!

Big Stories

×