Airtel Plan: దేశంలో ఐపీఎల్ ఫీవర్ మెుదలైంది. సాయంత్రం కాగానే క్రికెట్ ప్రియులు పెద్ద ఎత్తున ఐపీఎల్ మ్యాచ్ లను వీక్షిస్తున్నారు. ఈ మ్యాచ్ లను జియో హాట్ స్టార్ లైవ్ స్ట్రీమింగ్ చేస్తుండటంతో.. ఆ ఓటీటీని డబ్బులు చెల్లించిమరి సబ్ స్క్రిప్షన్ చేసుకుంటున్నారు. దీనిని గమనించిన ఎయిర్ టెల్.. తన యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. రూ.48 సరికొత్త ప్లాన్ ను కొత్త లాంచ్ చేసింది. ఇంతకీ ఈ ప్లాన్ ఏంటి? దీని ద్వారా యూజర్లకు కలిగే ప్రయోజనాలు ఏవి? ఇప్పుడు చూద్దాం.
ఐపీఎల్ నేపథ్యంలో క్రికెట్ ప్రియుల కోసం ఎయిర్ టెల్ ఈ ప్లాన్ తీసుకొచ్చింది. దీనిని రీఛార్జ్ చేసుకోవడం ద్వారా.. నెల రోజుల పాటు హాట్ స్టార్ ను ఉచితంగా వీక్షించవచ్చు. అయితే ఇది మెుబైల్ వెర్షన్ కావడంతో.. టీవీల్లో హాట్ స్టార్ వీక్షించేందుకు అవకాశం ఉండదు. మరోవైపు ఈ ప్లాన్ ద్వారా 1GB 4G డేటా సైతం యూజర్ కు లభిస్తుంది.
రూ.48 రీచార్జ్ ప్లాన్.. కేవలం డేటా వోచర్ మాత్రమే. ఇందులో కాలింగ్ లేదా ఎస్ఎంఎస్ లు వంటి ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. కాబట్టి ఐపీఎల్ మ్యాచ్ లు వీక్షించేందుకు అవసరమైన డేటా, ఫ్రీ కాల్స్ కోసం మరొక ప్లాన్ ను యూజర్ తప్పనిసరిగా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.
Also Read: Jio Offer: జియో బంపరాఫర్.. ఈ రీఛార్జ్ ప్లాన్స్తో.. రూ.35,100 సేవలు, 2TB స్టోరేజ్ ఫ్రీ..!
ఐపీఎల్ ను దృష్టిలో ఉంచుకొని ఎయిర్ టెల్ ఇప్పటికే కొన్ని ప్లాన్స్ తీసుకొచ్చింది. రూ.195, రూ.279, రూ.361 వంటి ఇతర ప్లాన్లలో కూడా జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ను ఉచితంగా అందిస్తోంది. అయితే వాటన్నింటిలోకి రూ.48 ప్లాన్ అత్యంత చౌకైనదిగా చెప్పవచ్చు. బడ్జెట్ ధరలో IPL మ్యాచ్లను వీక్షించాలని భావిస్తే.. వెంటనే రూ.48 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం మంచిది.
Also Read: Vijay Viral Speech: కోడి కత్తి, బాబాయ్ హత్య.. విజయ్ మాట్లాడింది జగన్ గురించేనా? అసలు ఏమన్నారు?