Android New Rules: ఆండ్రాయిడ్ ఫోన్లో ఒకేసారి చాలా యాప్స్ వాడుతున్నప్పుడు ఫోన్ నెమ్మదించడం, యాప్స్ క్లోజ్ అవ్వడం వంటి సమస్యలు చాలామందికి ఎదురవుతుంటాయి. అయితే ఈ సమస్యను తగ్గించేందుకు గూగుల్ కీలక మార్పులు తీసుకొస్తోంది. 2027 నుంచి యాప్స్ పనితీరు, ర్యామ్ వినియోగంపై మరిన్ని కఠినమైన నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
2027 ప్రారంభం నుంచి ఆండ్రాయిడ్ యాప్స్ ఎంత మెమరీ ఉపయోగిస్తున్నాయనే విషయంపై గూగుల్ కొత్త పరిమితులు విధించనుంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు అవసరానికి మించి ర్యామ్ వినియోగించే యాప్స్పై చర్యలు ఉండొచ్చు. దీంతో ఫోన్లో ఇతర యాప్స్ కూడా సాఫీగా పనిచేసే అవకాశం ఉంటుంది.
Also Read: ఫోన్ వెనుక కలర్ స్క్రీన్.. ఇదేం కొత్త టెక్నాలజీ.. Hisense A10 సిరీస్ వచ్చేసింది!
మెమరీ వినియోగంతో పాటు యాప్స్లో ఉండే సమస్యలను కూడా గూగుల్ పరిశీలించనుంది. యాప్స్ త్వరగా ఓపెన్ అవ్వడం, అనవసరంగా క్రాష్ కాకుండా ఉండటం కోసం డెవలపర్లు తమ కోడ్ను మరింత మెరుగ్గా తయారు చేయాల్సి ఉంటుంది. నిబంధనలు పాటించని యాప్స్కు ప్లే స్టోర్లో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
డెవలపర్ల కోసం Android Vitalsలో కొత్త టూల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. వీటి ద్వారా యాప్ ఎప్పుడు ఎక్కువ ర్యామ్ తీసుకుంటోంది? ఎక్కడ మెమరీ సమస్యలు వస్తున్నాయి? క్రాష్లకు కారణమేంటి? అనే విషయాలను సులభంగా గుర్తించవచ్చు.
కొత్త ఫోన్కు డేటా మార్చుకునే విధానంలోనూ గూగుల్ మార్పులు చేస్తోంది. ఏప్రిల్ 2027 నుంచి చాలా సాధారణ యాప్స్లో Zero Tap Sign In తప్పనిసరి కానుంది. రీస్టోర్ API ద్వారా పాత ఫోన్లో ఉన్న యూజర్ సెషన్ను కొత్త ఫోన్లోకి సురక్షితంగా తీసుకురావచ్చు. దీంతో ప్రతిసారి పాస్వర్డ్ టైప్ చేయాల్సిన అవసరం తగ్గుతుంది.
Also Read: ఫోన్ కంటే బిగ్ స్క్రీన్.. ల్యాప్టాప్ కంటే పోర్టబుల్.. టాప్-5 గేమింగ్ ట్యాబ్లెట్లు ఇవే!