E-Paper
Advertisement

Cyber Attack: 120 దేశాల్లో సైబర్ దాడులు

Cyber Attack: 120 దేశాల్లో సైబర్ దాడులు
Cyber Attack

Cyber Attack: నిరుడు 120కి పైగా దేశాలకు సైబర్ దాడుల ముప్పు తప్పలేదు. ఈ ముప్పు అధికంగా ఉన్న దేశాల జాబితాలో ఉక్రెయిన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, తైవాన్ అగ్రభాగాన నిలిచాయని మైక్రోసాఫ్ట్ తాజా నివేదిక వెల్లడించింది.

జూలై 2022 నుంచి జూన్ 2023 వరకు చోటు చేసుకున్న సైబర్ దాడులను విశ్లేషించిన ఆ సంస్థ ‘డిజిటల్ డిఫెన్స్ రిపోర్ట్ 2023’ నివేదికను విడుదల చేసింది. ఇక ఏయే దేశాల ప్రభుత్వాలు ఎక్కువగా సైబర్ దాడులకు పాల్పడ్డాయన్న వివరాలను ఆ నివేదిక పొందుపర్చింది.

రష్యా, చైనా, ఇరాన్, ఉత్తర కొరియా తదితర దేశాలు ఆ జాబితాలో ఉన్నాయి. సైబర్ దాడుల్లో దాదాపు సగం నాటో సభ్యదేశాలను లక్ష్యంగా చేసుకుని సాగాయి. ఇక భారత్‌పైనా సైబర్ దాడుల తీవ్రత పెరుగుతోందని నివేదిక వెల్లడించింది.

ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో జరిగిన సైబర్ దాడుల్లో 13 శాతం భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నవే. నిరుడు అత్యధిక దాడులను ఎదుర్కొన్న దేశంగా భారత్ ఐదో స్థానంలో ఉంది.

Related News

నథింగ్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఇయర్‌బడ్స్.. ఫీచర్లు తెలిస్తే వెంటనే బుక్ చేసుకుంటారు!

పాత ఫోన్ అమ్ముతున్నారా? ఈ 4 పనులు చెయ్యకుండా అమ్మితే.. మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ!

కేవలం రూ.1000 లోపు ఖర్చుతో ఇంటిని సూపర్ కూల్‌గా మార్చే సీక్రెట్స్ ఇవే!

రంగంలోకి దిగిన గూగుల్.. ఫేక్ కాల్స్ భరతం పట్టడం ఖాయం, వినియోగదారులు ఫుల్‌ హ్యాపీ

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

Big Stories

×