E-Paper
Advertisement

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

AI Bike Garuda: దేశంలో టాలెంట్‌కు కొదవలేదు. చాలామంది ప్రముఖులు చెబుతున్నమాట. కాకపోతే ప్రొత్సహంచేవారు తక్కువ. ఈ నేపథ్యంలో చాలామంది విద్యార్థులు విదేశాలకు వలస పోతుంటారు. తాజాగా ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు తొలి ‘ఏఐ బైక్’ని రూపొందించారు. యువకుల ఈ బైక్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఖర్చు ఎంతో తెలుసా? ఇంకా డీటేల్స్‌లోకి వెళ్దాం.

ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు శివమ్ మౌర్య-గురుప్రీత్ అరోరా-గణేశ్ పాటిల్ ‘గరుడ’ పేరుతో ట్రెండ్ కు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ ఆధారిత బైక్‌ను రూపొందించారు. ఆ బైక్‌ని 50 శాతం వ్యర్థాలు, మిగిలిన 50 శాతం కస్టమ్-మేడ్ భాగాలతో తయారు చేశారు. ఇందుకోసం వారు పెట్టిన ఖర్చు కేవలం రూ.1.80 లక్షలు మాత్రమే. నమ్మడానికి విచిత్రంగా ఉంది కదూ.

గరుడ బైక్‌లో భద్రతకు అత్యంత ప్రయార్టీ ఇచ్చారు. అందులో ఉన్న రెండు హై-రేంజ్ సెన్సార్లు రియల్‌టైమ్ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తాయి. వాహనానికి 12 అడుగుల పరిధికి రాగానే బైక్ నెమ్మదిస్తుంది. ఏదైనా అడ్డు వచ్చిందంటే మూడు అడుగుల దూరంలో బ్రేకులు వేయకుండానే వాయిస్ కమాండ్ ద్వారా ఆగిపోతుంది.

ఏఐ ఆధారితంగా వచ్చిన ఈ బైక్ రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని చెబుతున్నారు విద్యార్థులు. ఇక ఫీచర్స్ విషయానికొద్దాం.  ఈ బైక్‌లో టచ్‌ స్క్రీన్ ఇంటర్‌ఫేస్ ఉంది. దీనిద్వారా జీపీఎస్ నావిగేషన్, ఫోన్ కాల్స్, మ్యూజిక్ వంటి ఫీచర్లను వినియోగించుకోవచ్చు. ముందు, వెనుక అమర్చిన కెమెరాల ద్వారా తన చుట్టూ ఉన్న ట్రాఫిక్‌ను డిస్‌ప్లే స్క్రీన్‌పై రైడర్ చూసే అవకాశం ఉంది.

ALSO READ: శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 రిపేర్ చేయడం కష్టం

వైర్‌లెస్ మొబైల్ ఛార్జింగ్ వ్యవస్థ దీని సొంతం. ప్రొటోటైప్ మాత్రమే అయినప్పటికీ పనితీరు అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు. గరుడ ఎకో మోడ్‌లో 220 కిలోమీటర్లు కాగా, అదే స్పోర్ట్ మోడ్‌లో 160 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవచ్చు. లిథియం, అయాన్ బ్యాటరీ కావడంతో కేవలం రెండు గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది.మార్కెట్లో ఉండే ఎలక్ట్రిక్ బైక్‌ల కంటే వేగంగా ఛార్జ్ అవుతుంది.

ముగ్గురు విద్యార్థులు కేవలం ఏడాది సమయంలో దీన్ని రూపొందించారు. ఆటోమొబైల్ నిపుణుడు వినోద్ దేశాయ్ ఈ స్టూడెంట్స్‌ని ప్రశంసించారు. యువత సృజనాత్మకత ఇదొక ఉదాహరణగా పేర్కొన్నారు. వేస్ట్ టు బెస్ట్ అనే సూత్రానికి అనుగుణంగా వాహనాన్ని తయారు చేయడం బాగుందన్నారు. గుజరాత్‌లోని సూరత్ సిటీలోని భగవాన్ మహావీర్ యూనివర్సిటీ విద్యార్థులు ఈ ఘనత సాధించారు.

Related News

కేవలం రూ.1000 లోపు ఖర్చుతో ఇంటిని సూపర్ కూల్‌గా మార్చే సీక్రెట్స్ ఇవే!

రంగంలోకి దిగిన గూగుల్.. ఫేక్ కాల్స్ భరతం పట్టడం ఖాయం, వినియోగదారులు ఫుల్‌ హ్యాపీ

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

Big Stories

×