E-Paper
Advertisement

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’,  అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

CM Chandrababu: పౌరులకు సుపరిపాలన అందించడమే లక్ష్యంగా దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక ప్రణాళికలతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.  వచ్చే జనవరి నుంచి అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ ప్రారంభించబోతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతిలోని సచివాలయంలో డేటా ఆధారిత పాలనపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ‘‘గత ప్రభుత్వం చేసిన తప్పులను దిద్దుతూ ముందుకు వెళ్తున్నాం. నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి. అధికారులు ఈ విధానాన్ని అమలు చేసే విధంగా చూడాలన్నారు. సందేహలుంటే ఆర్టీజీఎస్ లో నివృత్తి చేసుకోవాలి. డేటా ఆధారిత పాలన అత్యంత కీలకం. ’’  అని అన్నారు.

“డేటా ఆధారిత పాలన”పై నిర్వహించిన సదస్సులో ఆయన కీలక సూచనలు చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి గ్రామ సచివాలయాలను “విజన్ యూనిట్లు”గా మార్చి, సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. టెక్నాలజీని ఉపయోగించడం వల్లే ఇటీవల సంభవించిన తుఫాన్ సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామని ఆయన గుర్తుచేశారు.

Read Also: ACB Raids: ఏపీ వ్యాప్తంగా ఏసీబీ సోదాలు.. వెలుగులోకి సంచలన విషయాలు

డేటా ఆధారిత పాలన భవిష్యత్తుకు అత్యంత కీలకమని నొక్కిచెప్పిన సీఎం, వచ్చే జనవరి నుంచే అమరావతిలో క్వాంటం కంప్యూటర్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. సీఎఫ్ఎంఎస్ (CFMS) వ్యవస్థ ద్వారా వనరులను సమర్థంగా వినియోగిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ విధ్వంసాన్ని చక్కదిద్దుతూ, “2047 విజన్ డాక్యుమెంట్” లక్ష్యాలకు అనుగుణంగా నెలవారీ, త్రైమాసిక లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేయాలని అధికారులను కోరారు.

ప్రతీ నియోజకవర్గానికి ఓ సీనియర్ అధికారితో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి విజన్ ప్లాన్ అమలు చేస్తామన్నారు. ఆర్టీజీఎస్ (RTGS) ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి, ఆయా శాఖలు వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు.

 

 

 

 

 

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×