Jio Cheapest 5G Smartphone: టెలికాం దిగ్గజం జియో తిరుగులేని రారాజుగా చక్రం తిప్పుతోంది. జియో ఎల్లప్పుడు తన వినియోగదారుల కోసం చాలా చౌకైన ప్లాన్లను అందిస్తుంది. భారతదేశంలో కోట్లాది మంది జియో నెట్వర్క్తో కనెక్టై ఉన్నారు. ఈ క్రమంలో కంపెనీ ఇప్పుడు తన 5G సిమ్ సేవతో కొత్త 5G స్మార్ట్ఫోన్ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే కంపెనీ దీని గురించి ఎటువంటి అఫిషియల్ సమాచారం ఇవ్వలేదు. కానీ కొన్ని లీకైన అప్డేట్ల ద్వారా రాబోయే ఫోన్ మెయిన్ స్పెసిఫికేషన్లను వెల్లడిస్తున్నాయి. కాబట్టి ఈ లీకైన అప్డేట్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
జియో నుంచి రానున్న చీపెస్ట్ 5G స్మార్ట్ఫోన్ లీకైన సమాచారం ప్రకారం ఈ రాబోయే స్మార్ట్ఫోన్ 6GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉండే అవకాశం ఉంది. జియో ఫోన్ కెమెరా గురించి మాట్లాడితే దానిలో 16-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను చూడవచ్చు. వీడియో కాలింగ్, సెల్ఫీల కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
జియో చీపెస్ట్ 5G ఫోన్లో ఉన్న మరోక ప్రత్యేకత ఏమిటంటే ఫోన్లో పవర్ కోసం 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ 33 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. కేవలం 30 నిమిషాల్లోనే ఈ డివైజ్ని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే మొత్తం 2 రోజుల పాటు ఫోన్ను ఉపయోగించవచ్చు.
Also Read: రూటు మార్చిన మోటో.. దిమ్మతిరిగే ప్రైస్తో కొత్త ఫోన్.. మతిపోగొడుతున్న ఫీచర్స్!
రాబోయే ఈ Jio చౌకైన 5G స్మార్ట్ఫోన్ 5.5 అంగుళాల HD డిస్ప్లేను కలిగి ఉంది. దీనిలో మీరు 4K వీడియోలను ప్లే చేయవచ్చు. ఫోన్ ధర గురించి మాట్లాడితే కంపెనీలు ఈ 5G ఫోన్ను చాలా తక్కువ ధరకే తీసుకురానుంది. ఈ సరికొత్త డివైజ్ ధర రూ.3000 ఉండనుంది. ఖరీదైన స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయలేని వారికి ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్. ఈ చీపెస్ట్ ఫోన్లో కొనుగోలుదారులు ఖరీదైన ఫోన్లో ఉండే అనేక ఫీచర్లు చూస్తారు. అందుకే రాబోయే ఈ ఫోన్ కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జియో త్వరలో ఈ స్మార్ట్ఫోన్ను భారతదేశంలో విడుదల చేయనుంది.