Poco M8 Power: తక్కువ ధరలో, అడ్వాన్స్డ్ ఫీచర్లతో వచ్చే పోకో ఫోన్లకు ఇండియన్ మొబైల్ మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పుడు ఇదే క్రేజ్ని మరింత పెంచేందుకు పోకో బ్రాండ్ నుండి సరికొత్త మొబైల్ రాబోతోంది. చైనాలో తాజాగా విడుదలైన ‘రెడ్మి నోట్ 17’ మోడల్ను ఇండియాలో ‘పోకో M8 పవర్’ పేరుతో రీబ్రాండ్ చేసి లాంచ్ చేయబోతున్నట్లు లీకులు అందుతున్నాయి. షియోమి హైపర్ఓఎస్ ఫర్మ్వేర్ కోడింగ్లో ఈ కొత్త ఫోన్ మోడల్ నెంబర్ కనిపించడంతో ఈ వార్తలకు బలం చేకూరింది.
సాధారణంగా బడ్జెట్ రేంజ్ ఫోన్లలో డిస్ప్లే సైజు కాస్త తక్కువగానే ఉంటుంది. కానీ ఈ పోకో కొత్త ఫోన్ ఏకంగా 7 అంగుళాల భారీ ఓఎల్ఈడీ (OLED) స్క్రీన్తో రాబోతున్నట్లు సమాచారం. దీనికి తోడు 120Hz రీఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉండటం వల్ల ఎండలో చూసినా కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీడియోలు చూడటానికి, గేమ్స్ ఆడుకోవడానికి ఈ పెద్ద స్క్రీన్ సూపర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.
ఈ ఫోన్కి ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీనే అని చెప్పాలి. దీనిలో ఏకంగా 8,000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అందించబోతున్నారు. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా కూడా ఫోన్ బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారట. దీనికి తోడు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అలాగే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 4 జెన్ 4 చిప్సెట్తో ఈ ఫోన్ పనిచేయనుంది. ఇది రోజువారీ పనులను చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది.
Also Read: యాపిల్ iPad Mini లవర్స్కు భారీ షాక్.. ఆ ఒక్క ఫీచర్ తీసేసి పెద్ద తప్పు చేశారా?
ఇక కెమెరాల విషయానికి వస్తే.. వెనుక వైపు 50MP ప్రధాన కెమెరా, ముందు భాగంలో సెల్ఫీల కోసం 8MP కెమెరా ఉండనున్నాయి. అలాగే 8GB వరకు ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లతో ఈ ఫోన్ రానుంది. ధూళి, నీటి తుంపర్ల నుండి రక్షణ కోసం IP65 రేటింగ్, అడ్వాన్స్డ్ AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లు ఇందులో ఉండబోతున్నాయి.
ఈ స్మార్ట్ఫోన్ లాంచ్ డేట్ లేదా ధర గురించి షియోమి కానీ, పోకో కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే బడ్జెట్ 5G విభాగంలో మిగతా బ్రాండ్లకు గట్టి పోటీ ఇచ్చేలా తక్కువ ధరలోనే పోకో ఈ ఫోన్ను మార్కెట్లోకి తెచ్చే అవకాశం ఉంది. పెద్ద డిస్ప్లే, భారీ బ్యాటరీ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ కానుంది.
Also Read: బడ్జెట్లో బెస్ట్ స్మార్ట్ సీలింగ్ ఫ్యాన్ కావాలా? కరెంట్ ఆదా చేయడంలో వీటికి తిరుగులేదు!