E-Paper
Advertisement

Reliance: జియో యూజర్లకు గుడ్‌న్యూస్.. ఏకంగా 100 జీబీ ఫ్రీ.. అంబానీ ఆఫర్ అదిరిపోయింది..!

Reliance: జియో యూజర్లకు గుడ్‌న్యూస్.. ఏకంగా 100 జీబీ ఫ్రీ.. అంబానీ ఆఫర్ అదిరిపోయింది..!

Reliance Jio AI-Cloud Welcome Offer: ప్రముఖ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తమ యూజర్లకు అదిరిపోయే న్యూస్ చెప్పారు. తాజాగా జియో ఏఐ క్లౌడ్ వెల్‌కమ్ ఆఫర్‌ను ప్రకటించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కొత్త ఆఫర్‌ను వెల్లడించారు. క్లౌడ్ స్టోరేజ్, AI-ఆధారిత సేవలను జియో వినియోగదారులందరికీ మరింత అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే Jio AI-Cloud వెల్‌కమ్ ఆఫర్‌ను తీసుకొచ్చారు. ఈ మేరకు Jio వినియోగదారులు 100 GB వరకు ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్‌ను పొందుతారని అంబానీ వెల్లడించారు.

ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్ సహా ఇతర డిజిటల్ కంటెంట్, డేటాను సురక్షితంగా స్టోరేజ్ చేయడానికి, యాక్సెస్ చేయడానికి ఈ క్లౌడ్ స్టోరేజ్‌ను ఉపయోగించవచ్చు. రిలయన్స్ కంపెనీ ఏజీఎం సందర్భంగా తమ 35 లక్షల మంది వాటాదారులను ఉద్దేశించి అంబానీ ఈ నిర్ణయం తీసుకున్నారు. జియో వినియోగదారులకు వారి డిజిటల్ ఆస్తులను నిర్వహించడానికి సురక్షితమైన మార్గాన్ని అందించడం ద్వారా డిజిటల్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఈ ఆఫర్ రూపొందించబడిందని అంబానీ తెలిపారు.

ఈ మేరకు అంబానీ మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు కనెక్టెడ్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించి ప్రతిఒక్కరి దృష్టి కోసం మా AI ప్రతిచోటా మద్దతు ఇవ్వడానికి, Jio AI-క్లౌడ్ వెల్‌కమ్ ఆఫర్‌ను ప్రకటించినందుకు నేను సంతోషిస్తున్నాను. జియో వినియోగదారులు తమ ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్‌లు, అన్ని ఇతర డిజిటల్ కంటెంట్, డేటాను సురక్షితంగా నిల్వ చేయడానికి, యాక్సెస్ చేయడానికి 100 GB వరకు ఉచిత క్లౌడ్ స్టోరేజ్‌ను కల్పిస్తున్నాం. అంతేకాకుండా దీనికంటే మరింత ఎక్కువ డేటా స్టోరేజీ అవసరం అయిన వారికి అతి తక్కువ ధరలోనే క్లౌడ్ స్టోరేజీని అందుబాటులోకి తెస్తాం’’ అని అంబానీ తెలిపారు. క్లౌడ్ స్టోరేజీని అందుబాటులో ఉంచడం వెనుక ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెప్పారు.

Also Read: జియో సినిమా లో హాట్ స్టార్ విలీనం పూర్తి.. ఆమోదించిన సిసిఐ

అయితే ఈ జియో ఏఐ క్లౌడ్ వెల్‌కమ్ ఆఫర్ ఈ ఏడాది దీపావళి నుంచే అందుబాటులో తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కాగా డిజిటల్ సేవలను అందించడంలో జియో నిబద్ధతను హైలైట్ చేస్తూ అంబానీ మాట్లాడుతూ.. ఇంకా ఎక్కువ స్టోరేజ్ అవసరమయ్యే వారికి మార్కెట్‌లో అత్యంత సరసమైన ధరలను కూడా కలిగి ఉంటామని అంబానీ హామీ ఇచ్చారు.

ఇది జియో వినియోగదారుల కోసం డిజిటల్ సేవలను అందించడం కోసం పండుగ సీజన్‌ను ఎంచుకుంది. ప్రతిఒక్కరికీ, ప్రతిచోటా క్లౌడ్ డేటా స్టోరేజ్, AI సేవలను అందించే శక్తివంతమైన, సరసమైన పరిష్కారంగా అభివర్ణిస్తూ అంబానీ ఈ సరికొత్త ప్రయోగం పట్ల తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. ‘‘మేము ఈ సంవత్సరం దీపావళి నుండి Jio AI-క్లౌడ్ వెల్‌కమ్ ఆఫర్‌ను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాము.. క్లౌడ్ డేటా స్టోరేజ్, డేటా-ఆధారిత AI సేవలు ప్రతిచోటా అందుబాటులో ఉండే శక్తివంతమైన, సరసమైన పరిష్కారాన్ని తీసుకువస్తాము’’ అని ఆయన ప్రకటించారు. ఇదిలా ఉంటే మరోవైపు తక్కువ ధరలకే ఏఐ మోడల్ సేవలను అందిస్తామని కూడా అంబానీ తెలిపారు. దీంతోపాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ హోల్డర్లకు సైతం గుడ్ న్యూస్ చెప్పింది కంపెనీ. ఈ మేరకు 1:1 రేషియోలో ఈక్విటీ బోనస్ షేర్లు జారీ చేయనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగానే త్వరలో కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఆమోదం తెలపనున్నట్లు వెల్లడించింది.

Related News

కేవలం రూ.1000 లోపు ఖర్చుతో ఇంటిని సూపర్ కూల్‌గా మార్చే సీక్రెట్స్ ఇవే!

రంగంలోకి దిగిన గూగుల్.. ఫేక్ కాల్స్ భరతం పట్టడం ఖాయం, వినియోగదారులు ఫుల్‌ హ్యాపీ

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

Big Stories

×